T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న T20 మ్యాచ్లో 2 సిక్సర్లు కొట్టడం ద్వారా సూర్య టీ20ల్లో 150 సిక్సర్ల మార్క్ను చేరుకున్నాడు. దీంతో, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ప్లేయర్ల జాబితాలో రోహిత్(205) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఓవరాల్గా రోహిత్ అగ్రస్థానంలో ఉండగా, సూర్య 5వ స్థానం దక్కించుకున్నాడు.