ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ రెండో సెమీఫైనల్లో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్ చేరింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 179/5 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 173/9 పరుగులకే పరిమితం అయింది. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇండియాతో వెస్టిండీస్ తలపడనుంది.