సినిమా, రాజకీయం పరంగా ఏ విషయమైనా హాట్ టాపిక్ అయ్యింది అంటే చాలు.. ఆ విషయం గురించి స్పందించే వారిలో కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ అందరికంటే ముందుంటారు. ఆ విషయం తనకు సంబంధించిందా.. లేదా అని పట్టించుకోకుండా.. హాట్ టాపిక్ అయితే చాలు తల దూరచేస్తారు. తాజాగా.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఇష్యూలో కూడా వర్మ ట్వీట్ చేశాడు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ని ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కొడుకుతో పోల్చుతూ ...
తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర చెరిగిపోనిది. నాడు సాయుధ పోరాటంలోనూ.. నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణలో ఇంకా ఆ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్ తో కలసి నడవాలని నిర్ణయించాయి. మొన్న మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ తో కలిసి వేసిన పాచికలు విజయవంతం కావడంతో అదే వ్యూహాన్ని ఈ ...
విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ల విషయంలో చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. నాని సోదరుడు చిన్నికి విజయవాడ టీడీపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిన్ని సహా మరో నలుగురికి టికెట్ ఇస్తే తాను ఒప్పుకోనని ఇటీవల నాని స్పష్టంచేశారు. ఓ సందర్భంలో విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతానని నాని సంకేతాలను ఇచ్చారు. అక్కడినుంచి తాను పోటీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకట...
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. రూ.4 వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని తెలంగాణ సర్కార్ కట్టబెట్టిందన్నారు. అందుకు బదులుగా తోట చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. రఘునందన్ రావు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. హఫీజ్ పేట సర్వే నంబర్ 78లో ఓ జెవెల్లరీ సంస్థ వ్యాపారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రం...
2023 క్యాలెండర్ ఏడాదిలో తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మూడు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ను ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం గం.2.30 ప్రకటించనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ రాష్ట్రాల ప్రస్తుత శాసన సభల పదవీకాలం మార్చి నెలలో ముగియనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధి...
దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ 18 జనవరి 1996లో కన్నుమూశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు...
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తనయుడు సాయిభగీరథ్ తోటి విద్యార్థిపై కాలేజీలో దాడి చేసిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఓ అమ్మాయిని తనను వేధించిన కారణంగానే సాయిభగీరథ్ తనను కొట్టాడని బాధిత విద్యార్థి కూడా వీడియో విడుదల చేశారు. తామిద్దరం ఇప్పుడు స్నేహితులుగా ఉంటున్నామని, అనవసరంగా దీనిని ఇష్యూ చేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగ...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. మోదీ అధ్యక్షతన ఇటీవల ఎన్డిఎంసి కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు. 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు...
బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో అందరి ఎదుటే.. ఒక నేతపై మరో నేత అరవడం హాట్ టాపిక్ గా మారింది. నేడు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించగా… మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్...
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ…..త్వరలోనే కాంగ్రెస్ లోకి అడుగుపెడతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వరుణ్ గాంధీ… బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ ఉండటంతో.. ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా… ప్రస్తుతం జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఇదే విషయం ప్రశ్నించగా… ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుణ్ గాంధీ… కాంగ్రెస్ లోకి రారు ...
నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్నవాళ్లకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తే గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి 25వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్లో ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని తాను చెప్పలేదన్నారు. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో టీడీపీలోకి చేరి...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత తగిన గుణపాఠం నేర్చుకున్నామని, పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. అయితే కాశ్మీర్లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని చెప్పడం గమనార్హం. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీ...
తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన చాలా మంది సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా…. ఆ సోషల్ మీడియా కారణంగానే ఆయన ప్రస్తుతం ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో కేటీఆర్ చోటు దక్కించుకున్నారు.వరల్డ్ టాప్ 30 జాబితాలో మ...
వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది జగన్ అభిప్రాయం, మా ముఖ్యమంత్రి ఇక్కడి నుండి పోటీ చెయ్ అలీ అంటే నేను రెడీ అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు […]
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా సభలకు అనుమతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. తనకు అన...