తెలంగాణలోని ఇరిగేషన్ (Irrigation) ప్రాజెక్టులు అద్బుతంగా ఉన్నయని అటువంటి ప్రాజెక్టులను పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని మాన్ తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద కలియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందని పంజాబ్ సీఎం ప్రశంసించారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని కీలక పోస్టులో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (DISHA) చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ సమయంలో ఎమ్మెల్యే ‘లంచగొండి, బందిపోటు నువ్వు. నీ చెంప పగలగొడతా’ అంటూ ఆమెకు చేయి చూపించాడు. ఏమిటా మాటలు అని సీఐ అనిత నిలదీయగా చేయి వేసి ఎమ్మెల్యే నెట్టి వేశాడు. దీంతో తోటి పోలీసులు కూడా ఎమ్మెల్యే వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వార్తను ఓసారి చదివేయండి మరి.
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్, ధరణీ సమస్యలు, నిరుద్యోగం సహా అనేక ఇబ్బందులు ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేయడం ఖాయమని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
వివిధ కేటగిరిల్లోనూ ఈ నివేదికను ఏడీఆర్ తయారు చేస్తుంది. ఏడీఆర్ నివేదికను పరిశీలిస్తుంటే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలుస్తోంది. ఢిల్లీ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి అత్యధికంగా బీజేపీ విరాళాలు వస్తున్నాయి. ఢిల్లీ మినహా ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో అక్కడి నుంచే అధిక విరాళాలు వస్తున్నాయి. కాగా తాజా నివేదికపై రాజకీయ దుమారం రేగింది.
గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది. అన్ని మతాల పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘం నాయకులు కవితకు వినతిపత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు.
ఈరోజే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపడుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) తెలిపారు. తానే కాదు మిగతా నేతలు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టాలని అనుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల నుంచి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపట్టాలని కొందరు నేతలు కోరుతున్నారు.
తెలంగాణలో విమానాశ్రయాల (Airports) ఏర్పాటుకు సహకరించాలంటూ సీ ఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. ఆదిలాబాద్, జక్రాన్పల్లి,వరంగల్ (Warangal) లో విమానాశ్రయాల ఏర్పాటుపై రాసిన లేఖలకు స్పందించాలని ఆయన అన్నారు. పౌర విమాయాన శాఖ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్(KCR) కు కిషన్ రెడ్డి సూచించారు.
chandrababu on cm jagan:ఏపీ సీఎం జగన్పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) ఫైరయ్యారు. జగన్ ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్లు వేస్తాడట.. 'నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం' అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు (chandrababu) ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు కారణమైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ (sticker) వేస్తాడట అని ఎద్దేవా చేశారు.