టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...
పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించారు. దీనికి సంబంధించి టీచర్లు టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. విద్యా వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆప్ పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చింది. దీంట్లో భాగంగానే..పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచటానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల...
పాల వినియోగదారులకు అమూల్ సంస్థ మరోసారి షాకిచ్చింది. కొన్నాళ్లుగా పాల ధరను పెంచుతున్న అమూల్ తాజాగా మరోసారి పెంచేసింది. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ సంస్థ ‘గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. గుజరాత్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాల ధరలు పెరుగుతాయని గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. లీటర్ పాలపై రూ.3 వరకు పెంచినట్లు అమూల్ సంస్థ...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల్లో 65 శాతానికి పైగా, గత వారం రోజుల్లో 56 శాతానికి పైగా కుప్పకూలింది. ఉదయం గం.11 సమయంలో ఓసారి రూ.1000 స్థాయి...
అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారం పార్లమెంట్ ను వీడడం లేదు. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు రెండు రోజు కూడా ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. చదవండి: పుట్టుక నీది.. చావు నీది అంటూ త...
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావ...
తన గొంతు ఆగాలంటే తనను ఎన్కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు రంగం సిద్ధమంటూ లీకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్లాలని చూస్తారని, కానీ తాను మాత్రం అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. చివరి వరకు పార్టీలో ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చ...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు...
ఇటీవల వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో విమాన ప్రయాణమంటేనే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. దీనికి తోడు విమానాల్లో ప్రయాణికులు నానా రభస సృష్టిస్తుండడంతో విమాన ప్రయాణాలు చేయలేని పరిస్థితి. తాజాగా మరో సంఘటన జరిగింది. ఆకాశంలో ఉండగానే ఓ విమానంలో మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. పైలెట్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. చదవండి: ఉలిక్కిప...
తనకు తన తండ్రి హెచ్డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిన...
ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...
తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కళాతపస్వీ ఇకలేరని తెలుసుకున్నతెలుగు చిత్రపరిశ్రమ షాక్కు గురైంది. కాశీనాధుని విశ్వనాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మరుపురాని అజరామరమైన చిత్...
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఫోన్ చేశారు. రాజకీయంగా ఈ రెండు పార్టీల నేతలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటిది వారు ఒకరికి మరొకరు ఫోన్ చేసుకోవడం ఏంటా అనే సందేహం కలుగుతోందా..? వీరు ఇరువురు తారకరత్నకు బంధువులు కావడం ఇక్కడ కామన్ పాయింట్. ఇంతకీ మ్యాటరేంటంటే… లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు...