KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్లో భాగంగా కనగర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బీఆర్సీ ఇంఛార్జ్ మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోగి, పచ్చ పురుగులు, తాటి ఆకు తెగుళ్లు తదితర సమస్యల నివారణపై వివరించారు. నీమాస్త్రం, జీవామృతం, పుల్లటి మజ్జిగ ప్రయోజనాలను తెలియజేసి అగ్ని అస్త్రం తయారీని ప్రదర్శించారు.
TG: పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా మంత్రి పరిశీలించారు. హట్టిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.
KMR: తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ సీనియర్ రేషన్ డీలర్ పరందాములు అనారోగ్యంతో మృతి చెందారు. జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్, ప్రధాన కార్యదర్శి సంతోష్ రావు, గౌరవాధ్యక్షుడు లద్దూరి లక్ష్మీపతి యాదవ్, గౌరిశెట్టి రాజు తాడ్వాయి మండల రేషన్ డీలర్ల సమక్షంలో పరంధాముల కుటుంబ సభ్యులకు ఇవాళ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ATP: రాయదుర్గంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని MLA కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రూ.64.81 కోట్లతో చేపట్టిన ఈ గృహ సముదాయాల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన నిధులు కేటాయిస్తే 1008 పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు.
VZM: గజపతినగరం మండలంలో ఈదురుగాలులకు 150 ఎకరాలు మొక్కజొన్న పంట నేలకొరిగిందని సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల జ్యోతి చెప్పారు. నేలకొరిగిన మొక్కజొన్న పంటను పలు గ్రామాల్లో ఏడిఏ నిర్మల జ్యోతితో పాటు మండల వ్యవసాయ అధికారి ఏ కిరణ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండలం చర్లపల్లి సర్పంచ్ లక్ష్మమ్మ మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలను గుర్తించి దాదాపు లక్ష యాభై వేల రూపాయలతో పనులను ప్రారంభించారు. భవిష్యత్తులో మెయిన్ లైన్ నుంచి గ్రామానికి నీరు సరఫరా సాఫీగా కొనసాగుతుందని తెలిపారు.
స్నేహితులు తగ్గిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో ఫ్రెండ్ షిప్ ఆన్లైన్కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వందమంది స్నేహితులుంటే 1990 ప్రాంతంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15శాతం మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్ షిప్ రిసెషన్’ అంటారు. మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?
CTR: పాలసముద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ.హేమలత తెలిపారు. ప్రభుత్వ జూ.కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 100 మందికి 100 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
HYD: స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు భయం విడిచి ఆత్మవిశ్వాసంతో, సమయపాలనతో పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. క్రమశిక్షణ – రివిజన్తోనే విజయాన్ని సాధించాలన్నారు.
MBNR: ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో ఎంతోమంది పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బుడగ జంగం కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశానికి పాల్గొని ప్రారంభించారు. నేరుగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వారికి డబ్బులు అకౌంట్లోనే జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
PDPL: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష గురువారం తెలిపారు. బీపీఎల్ కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాలు గల వారు మరణిస్తే ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఇదివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం పొందని వారు అర్హులన్నారు.
VKB: శివరాంనగర్ కాలనీ దర్గా వద్ద ఒక పండితుడు తన హోండా షైన్ (TS34F9519) బైక్ను ఇంటి ముందు పార్క్ చేసి పంచాంగం చెప్పడానికి లోపలికి వెళ్లారు. కొద్ది సేపటిలో బయటకు వచ్చి గమనిస్తే బైక్ దొంగిలించబడినది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికులను అప్రమత్తంగా ఉండమని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ రాకమకొండ బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించనున్నాయి. సర్పంచ్ స్వాతి తిరుపతయ్య తన ఖర్చుతో 3 కిమీ మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేయించింది. బీటీ రోడ్ మంజూరుపై నాయకులు ఎప్పటికీ స్పందించకపోవడం ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించదని అభిప్రాయపడ్డాడు. గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. అమీర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.