SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.
NRPT: ఉట్కూరు మండల పరిధి బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దాతలు సహకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, శ్రీ అంబత్రాయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరశ్రీతో కలిసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు సదుపాయాని వినియోగించుకోవాలని కోరారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఐశ్వర్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు సహాయం అందించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి చీరను అందజేశారు. గత 21 ఏళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
AP: రాష్ట్రంలో మలేరియా కేసులు తగ్గుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అల్లూరి, మన్యం జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయని చెప్పారు. దోమల నియంత్రణకు స్ప్రే, ఫాగింగ్, డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 89,845 దోమతెరలు పంపిణీ చేశామని వెల్లడించారు.
NGKL: హైదరాబాద్ ఏవీ కాలేజీలో ప్రారంభమైన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శనివారం జరిగిన మొదటిరోజు సమావేశంలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కథా రచయిత వహీద్ ఖాన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిల్లా కవులు తాము రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
TG: జోగులాంబ గద్వాల జిల్లాలో ఐజ పట్టణ పరిధిలో ఒక డ్రిప్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో డ్రిప్ పైపులు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.
VZM: స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ కింద శనివారం రాజాం పురపాలక సంఘ పరిధిలో పోలిపల్లి అమ్మవారి గుడి దగ్గర నుంచి బొబ్బిలి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. శుభ్రతను ప్రోత్సహించి, చెత్త లేని పరిసరాలను సాధించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు తెలిపారు.
KMR: బాన్సువాడ రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఘటనపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ క్రమంలో వ్యక్తిపై దాడి చేసిన వారు, రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఆందోళన చెందకుండా తమ రోజువారీ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.
MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు పంట ఉత్పత్తుల ధరలను కార్యదర్శి అశ్వక్ హైమద్ వెల్లడించారు. వేరుశనగ గరిష్టంగా రూ.10,621, పత్తి రూ.6,301 పలికింది. మినుములకు గరిష్ట ధర రూ.8,063 లభించగా, మొక్కజొన్న రూ.1,889 ధర పలికినట్లు తెలిపారు. ఆయా పంటల కనిష్ట ధరలు వేరుశనగకు రూ.4,669,పత్తికి రూ.4,001,మినుములకు రూ.7,150,మొక్కజొన్నకు రూ.1,701గా నమోదయ్యాయి.
BDK: కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా ఫిబ్రవరి 27న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఇల్లెందు IFTU కార్యాలయంలో పార్టీ నాయకులు వాల్ పొస్టర్లను ఆవిష్కరించారు. డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు.
ఖర్జూర పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక. ఎముకలు, దంతాల ధృఢత్వానికి, తక్షణ శక్తికి ఇవి తోడ్పడతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి.
SRPT: నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని సాయి 74వ జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన సాయిని మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కోటి, కార్యదర్శి కరుణాకర్ అభినందించారు. ఈ సందర్భంగా సాయికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
KMR: కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ADB: గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్ ఖాన్ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కేంద్రంలో రికార్డులను తనిఖీ చేసిన ఆయన పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, విద్యా బోధన తీరును పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చూడాలని, శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.