తారకరత్న అకాల మరణం నందమూరి కుటుంబంలో, చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిన్న హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న అంత్యక్రియలు నేడు సాయంత్రం (సోమవారం, 20 ఫిబ్రవరి) మహాప్రస్థానంలో జరగనున్నాయి
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ (kerala) సర్కారు షాకిచ్చింది. ఇకపై వారు ఎలాంటి యూట్యూబ్ (youtube) చానళ్లు నిర్వహించారాదని ఆర్డర్ (orders) జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందంటు రీసెంట్ గా రిలిజ్ చేసిన జోవోలో తెలిపింది.
శివసేన (shiv Sena) పార్టీలోని ఉద్ధవ్ థాక్రే గ్రూప్ కు (Uddhav Thackeray) చెందిన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut)ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ గుర్తు కోసం 2000 కోట్లు చేతులు మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు.
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన...
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది.
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 6 వికెట్లతో సౌరాష్ట్రను ఆదివారం బెంగాల్పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. దీంతో నాల్గవ రోజున మూడు సీజన్లలో రెండో టైటిల్ ను బెంగాల్ పై విజయం సాధించి గెలుపొందారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్లో రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర గెలుపొందింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా...తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ స్టేషన్ గ్రౌండ్ దగ్గర ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశం ప్రకారం మ్యాన్యువల్ గా హైట్ చెక్ చేయకుండా మళ్లీ డిజిటల్ మీటరే ఉపయోగించి తమను డిస్ క్వాలిఫై చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. మరోవైపు లాంగ్ జంప్, షాట్ పుట్ కూడా ఎక్కువగా పెట్టి తమకు డిస్ క్వాలిఫై చేశారని ఇంకొంత మంది వాపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (contonment) బీఆర్ఎస్ (brs) ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంత కాలంగా గుండె, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన యశోద హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన నాలుగు సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన ఆయన 2014 తర్వాత బి అర్ ఎస్ పార్టీలో చేరారు. 2018లో మరోసారి అదే పార్టీ నుండి విజయం సాధించారు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు(Aadhar Card)ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకోసం యూఐడీఏఐ(UIDAI) ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఆధార్ కేంద్రాల ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి ఉంచింది. అయితే పిల్లలకు సంబంధించి కొన్ని నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది.
బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.