• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కాయకల్ప టీమ్

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని కాయకల్ప టీం వైద్యాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల వసతులు, పరిశుభ్రతను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ హర్షవర్ధన్, సిబ్బంది ఉన్నారు.

February 21, 2026 / 03:19 PM IST

‘ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలి’

GDWL: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి హృదయ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్ష గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

February 21, 2026 / 03:18 PM IST

‘పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి రాయాలి’

SRCL: పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలని, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు.

February 21, 2026 / 03:18 PM IST

కామారెడ్డిలో ఉద్రిక్తత.. అసలేం జరిగింది?

TG: కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వెంకట రమణారెడ్డి రూ. 6 కోట్లకు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. దీనిపై స్పందించిన వెంకటరమణ రెడ్డి షబ్బీర్‌కు దమ్ము ధైర్యం ఉంటే తన కుటుంబాన్ని తీసుకుని చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఇక చూస్కో షబ్బీర్.. నేను రెడ్డినో బుడ్డినో చూపిస్తా. నీ సంగతి చూస్తా’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

February 21, 2026 / 03:18 PM IST

ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి: జాన్ వెస్లీ

జనగామ 3వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన బూడిది జ్యోతి గోపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నేతలను కలిశారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాన్ వెస్లీ కౌన్సిలర్‌కు సూచించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:17 PM IST

మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి: మంత్రి

MLG: మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఆవిష్కరించారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

February 21, 2026 / 03:15 PM IST

‘వివేకా హత్య.. నాటకాల రాయుడు నాటకాలు ఆడారు’

AP: లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ‘తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు ఉన్నారు. వైఎస్ వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెపం నెట్టారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారు’ అని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:15 PM IST

ఫార్మా రంగంలో భారీ విక్రయం

స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ఏజీ భారత్ నుండి తప్పుకుంటోంది. నోవార్టిస్ ఇండియాలో తనకున్న 70.68% వాటాను రూ.1,446 కోట్లకు క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. అదనంగా 26% వాటా కోసం షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లతో ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ భారీ డీల్ పూర్తి కానుంది. దీంతో భారత వ్యాపారానికి నోవార్టిస్ ఫుల్‌స్టాప్ పెట్టనుంది.

February 21, 2026 / 03:12 PM IST

మెరిసే చర్మం కోసం అరటిపండు!

అరటిపండు ఆరోగ్యానికే కాదు, సహజ సౌందర్యానికి అద్భుత ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మాన్ని మృదువుగా మార్చి మెరుపును ఇస్తాయి. బాగా పండిన అరటి గుజ్జును ఫేస్ ప్యాక్‌గా వాడితే ముడతలు, మృతకణాలు తొలగిపోతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ మొటిమల మచ్చలను తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

February 21, 2026 / 03:12 PM IST

ఉగ్ర కుట్రపై డీఐజీ కీలక ప్రకటన

HYD: చంచల్‌గూడ సెంట్రల్ జైలు వేదికగా ఉగ్రకుట్ర జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులేనని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేయవద్దని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని గుర్తు చేశారు. జైలులో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన జాహిద్ అనే ఖైదీ ఒక్కరే ఉన్నాడని డీఐజీ శ్రీనివాస్ తెలిపారు.

February 21, 2026 / 03:10 PM IST

కాంగ్రెస్ తీరు ఆవేదన కలిగించింది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ మెచ్చుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. AI సదస్సులో కాంగ్రెస్ వాళ్ల అర్థనగ్న ప్రదర్శన ఆవేదన కలిగించిందన్నారు. కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని హితవు పలికారు. విశాఖలో 15 బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

February 21, 2026 / 03:08 PM IST

PACS ఉద్యోగుల నిరసన దీక్ష

PPM: రైతుల ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం, ప్రభుత్వ లక్ష్యాలను అమలుపరుస్తూ నిరంతరం సేవ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చలేక పోతుందని ఎఐటీయుసీ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జెఎసి) చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేశారు.

February 21, 2026 / 03:07 PM IST

‘మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలు’

MNCL: విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలను జన్నారం మండలంలోని లోతరే గ్రామ సర్పంచ్ బోడ శంకర్ సూచించారు. శనివారం లోతరేలో పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంచి విద్యకు పెట్టింది పేరు ప్రభుత్వ పాఠశాలలని స్పష్టం చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

February 21, 2026 / 03:06 PM IST

బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా కోటేశ్వరరావు

NLG: దేవరకొండలోని రాంనగర్ 16వ వార్డుకు చెందిన రెడ్డి కోటేశ్వరరావు నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 03:05 PM IST

రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ పిలుపు

VSP: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా డాబా గార్డెన్స్‌లోని అంబేద్క‌ర్ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని విమర్శించారు. ఒక శాతం కార్పొరేట్ల వద్ద పోగుపడిన సంపదపై పన్నులు వేసి ప్రజలకు పునర్వినియోగం చేయాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:05 PM IST