MLG: జిల్లాలో సాగునీటి సౌకర్యాల విస్తరణకు రాష్ట్ర మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ వినతిపత్రం సమర్పించారు. గోదావరి రైట్ బ్యాంక్పై కొత్త ఎత్తిపోతల పథకంతో పాటు, కన్నాయిగూడెం లక్ష్మీపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణకు అనుమతి కోరారు. రూ. 22 కోట్లతో 921 ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిపాదనను వివరించగా, సీఎం సానుకూలంగా స్పందించారు.
WNP: జిల్లా పెద్దమందడి మండలం కన్మనూరు గ్రామానికి చెందిన మీనిగ బాలయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సందర్భంగా ఆదివారం కన్మనూరు గ్రామానికి వెళ్లి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్యను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
CTR: పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్టపై గల బస్సు షెల్టర్లో ఓ వ్యక్తి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. అతడికి దాదాపు 40 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు చేసి, బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
KNR: కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్ల ప్రవర్తిస్తున్నారని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు.
AP: రాజమహేంద్రవరం అనూరియా కేసులపై ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ కీలక సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KMM: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సీఎం కప్ క్రీడల పోటీలలో ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దమునగాల గ్రామానికి చెందిన అభిషేక్ గౌడ్, ఊషు క్రీడలో సబ్ జూనియర్ 48 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించారు. జాతీయ కోచ్ పరిపూర్ణ చారి వద్ద శిక్షణ పొందుతున్న 8వ తరగతి విద్యార్థి అయిన అభిషేక్ గౌడ్ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
BPT: చెరుకుపల్లి మండలం కావూరు హైస్కూల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జొన్నలగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన మొవ్వ ముత్యాలరావు (46) దుర్మరణం చెందారు. రాంబట్లపాలెం నుంచి ఎరువుల బస్తాలతో బైకుపై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని కారు ఆయనను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముత్యాలరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్లో జరుగుతున్న నెట్ బాల్ పోటీలకు అక్షయ్, ధనుష్, సంజయ్, జగదీశ్ ఎంపికైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అలాగే వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల పరుగు పందెంలో వినయ్ కుమార్, దీపక్ పాల్గొననున్నారు.
KDP: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆమె భర్త, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఆహ్వానం పలికి దర్శనం చేయించారు.
MNCL: హైదరాబాద్లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మంచిర్యాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-25 విభాగంలో రాహుల్ బంగారు పతకం, శ్రీజ కాంస్య పతకం సాధించగా, అండర్-14 విభాగంలో చైత్ర కాంస్య పతకం గెలుచుకుంది. విజేతలను DYSO హనుమంత్ రెడ్డి, యోగాసన సంఘం నేతలు అభినందించారు. జిల్లా పేరు నిలబెట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు.
JGL: మల్యాల మండలం రాంపూర్ గ్రామశివారులోని ఐకేపీ సెంటర్ సమీపంలో వరద కాలువ వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగామట్టిని నింపుతున్న 3 టిప్పర్లు, ఓ జేసీబీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
BDK: ఆళ్లపల్లి మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని మండల తహసీల్దార్ ప్రకటించారు. మండలానికి చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
TPT: శ్రీకాళహస్తికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవాళ రానున్నారు. గోపురం వద్దగల ధూర్జటి కళా ప్రాంగణంలో ఆయన ప్రవచనం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులకు ఆత్మశాంతి అందిస్తాయన్నారు.
PDPL: రామగిరి మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రత్నాపూర్ రైతు వేదికలో 5 రోజుల సాధారణ అవగాహన శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని, మొత్తం 148 మంది సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో బి. శైలజారాణి ఆదేశించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సభ్యుల హాజరు కావాలన్నారు.