NLR: ఉదయగిరి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహన దారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
KNR: జమ్మికుంట మండలంలోని రైతులకు వివిధ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ ఖాదర్ హుస్సేన్ తెలిపారు. మాచినపల్లి HACA కేంద్రానికి 340, నాగంపేట DCMS 340, జమ్మికుంట JRUPSS కేంద్రానికి 340 బస్తాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. యూరియా అవసరమైన రైతులు సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకొని పొందవచ్చన్నారు.
TPT: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. విశాలాక్ష్మి నగర్ ఫ్లైఓవర్ వద్ద పూతలపట్టు-నాయుడుపేట హైవేపై లారీ రెండు బైక్లను ఢీకొట్టడంతో నారాయణపురం గ్రామానికి చెందిన చంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్, రమేశ్కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, WGL, యాదాద్రి, RR, మేడ్చల్, VKBD, NGKL జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయలవలదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని ఇసుక పాలెంలో శాంత బయోటెక్నిక్స్ ఆధ్వర్యంలో శాంత – వసంత ట్రస్టు, శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ADB: ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని పాండ్రకవడ నుంచి ఆదిలాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో కండక్టర్గా విధుల నిర్వర్తించిన సి. సతీశ్ ఆ సెల్ ఫోన్ను స్టేషన్ మేనేజర్ శ్రీరాములు సమక్షంలో సదరు ప్రయాణికుడికి అప్పగించి ఉదరాత చాటుకున్నారు. అతన్ని పలువురు అభినందించారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చైనీస్ సంప్రదాయం ఉట్టిపడేలా విద్యుత్తు లాంతర్లు, దీపాలతో మందిరాన్ని అందంగా అలంకరించారు. వివిధ దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.
కృష్ణా: నాగాయలంకలోని బీసీ గర్ల్స్ హాస్టల్లో శక్తి టీం-4 ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181 హెల్ప్లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
కోనసీమ: అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామదేవత తోటలమ్మ అమ్మవారికి 6 కేజీల వెండితో తొడుగు, మకరతోరణం, 111 కేజీల పంచలోహాలతో మరో మకరతోరణం ఆదివారం బహూకరించారు. పాలగుమ్మి చెందిన బొక్కా సత్యనారాయణ, రవికుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి మకర తోరణాలు చేయించారు. రూ.30 లక్షల ఖర్చుతో వెండి వస్తువులను తయారు చేయించి అమ్మవారికి అలంకరించారు.
SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యూ. సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు అని ఆయన పేర్కొన్నారు.
ATP: గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. ధర్మవరానికి చెందిన శారద తన బంధువులతో కలిసి యాదగిరి వెళ్తుండగా బీదర్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగం తగ్గడంతో గుర్తుతెలియని దొంగ.. ఆమె మెడలోని మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు రైలు చైన్ లాగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
NGKL: కుమ్మర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో బీసీ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని TRP చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు.
SRPT: ప్రజల ప్రాణ పత్రిక లక్ష్యంగా నేటి నుంచి వారం రోజులపాటు సూర్యాపేట జిల్లాలో రెండో దశ అర్తెవ్ అల్తెవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించడం, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.
TG: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.