• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా ప్రారంభమైన హ్యాపీ సండే కార్యక్రమం

విజయనగరం స్థానిక కోట జంక్షన్ వద్ద హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు హ్యాపీ సండే వేడుకను ప్రారంభించి, కార్యక్రమం ఔన్నత్యాన్ని విశదీకరించారు. పలువురు కళాకారులు పాటల రూపంలో, డాన్స్ ల రూపంలో తమ ప్రతిభను కనపరిచారు. మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఉల్లాసాన్ని కలిగించేందుకు హ్యాపీ సండే కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

February 22, 2026 / 08:30 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ

W.G: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం 34 మంది లబ్ధిదారులకు రూ. 27,15,924 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటివరకు 35 విడతల్లో మొత్తం 576 మందికి రూ. 4.79 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఆధారంగానే ఈ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

February 22, 2026 / 08:30 AM IST

నార్నూర్‌లో అక్రమ మట్టి రవాణా

ADB: నార్నూర్‌లో ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వి మట్టిని తరలిస్తున్న ఉదంతం కలకలం రేపింది. ఓ పెట్రోల్ బంక్ నిర్మాణానికి అవసరమైన మట్టిని అధికారులు అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ రాత్రుళ్లు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ఆస్తిని దోచుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

February 22, 2026 / 08:30 AM IST

ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి: కలెక్టర్

NRPT: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. మండలంలో ఎన్నికల ప్రాజెనీ మ్యాపింగ్ తహసీల్దార్ రవి, బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 22, 2026 / 08:29 AM IST

రూ.151కే ఇంటికి భద్రాచల రాములోరి కళ్యాణ తలంబ్రాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151లకే అందించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణకు చెందినవారు ఈ నెల 23వ తేదీన www.tgartclogistics.co.inలో రిజిస్టర్ చేసుకోవాలని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలు అందజేస్తామని ఆయన వివరించారు.

February 22, 2026 / 08:27 AM IST

బావిలో పడి వ్యక్తి మృతి

BHPL: చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఏకు సారయ్య (55) రేగొండ మండలం కొడవటంచలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ప్రతి వారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే సారయ్య, ఈ నెల 17న ఆలయానికి వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బావిలో దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం లభ్యమయింది.

February 22, 2026 / 08:25 AM IST

తగ్గనున్న వంటనూనె ధరలు?

వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10% తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల మొత్తం సుంకం 27.5% నుంచి 16.5% పడిపోతుంది. భారత్ తన వంటనూనెల అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ నూనెపై ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

February 22, 2026 / 08:25 AM IST

అటవీ ప్రాంతాల్లో అర్థరాత్రి తవ్వకాలు…!

MHBD: గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శనివారం అర్థరాత్రి తవ్వకాలు చేశారు. సీతానగరం గ్రామ యువకులు ఆ వ్యక్తులను ఆరా తీశారు. వారు పోంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు అటవీశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేలోపో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 08:24 AM IST

‘మండల స్థాయిలో ప్రజావాణి పునః ప్రారంభం’

MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదే రోజు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 2 నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

February 22, 2026 / 08:23 AM IST

నేడు నారాయణ గూడెం మందకృష్ణ రాక..!

SRPT: మునగాల మండలం నారాయణ గూడెంలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితులపై దాడి చేసినా, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధ్యత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 08:21 AM IST

చెత్తను తొలగించిన MRO

ASR: పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కొయ్యూరు MRO మురళీబాబు అన్నారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర-స్వరాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం సిబ్బందితో కలిసి స్వయంగా చెత్తను తొలగించారు. కార్యాలయం లోపల, బయట ప్రాంగణంలో చెత్తా తొలగించి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

February 22, 2026 / 08:18 AM IST

సీసీ కెమెరాల నిగా పెంచాలి: ఎస్పీ

NDL: రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాల నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాన్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మల సత్రం ఆర్టీసీ బస్టాండ్ బైర్మల్ విధి శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

February 22, 2026 / 08:18 AM IST

మెదక్ జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని వ్యాపారులు తెలిపారు.

February 22, 2026 / 08:18 AM IST

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

GNTR: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ సిద్ధమైందని శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు సీసీ కెమెరాలు అమరిక, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 08:16 AM IST

బంటనహళ్‌లో ఉచిత యోగా, గ్రంథాలయ కేంద్రం ప్రారంభం

KRNL: బెంగళూరులో స్థిరపడ్డ గ్రామ వాసి శ్రీ నాగరాజేంద్ర గౌడ్ గ్రామంలోని 5–12 ఏళ్ల పిల్లల కోసం ఉచిత యోగా శిక్షణ, గ్రంథాలయం, వ్యక్తి వికాస్ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యా అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవను అభినందించారు.

February 22, 2026 / 08:16 AM IST