నటుడు రోబో శంకర్ (Robo Shankar) చిక్కుల్లో పడ్డారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ (Alexandrine) జాతికి చెందిన చిలుకలను (parrots)పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ (zoopark) తరలించారు. ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ (home tour) పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు అందుకు మూల్యం చెల్లించుకు...
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చారు.
నీతి ఆయోగ్(NITI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కేంద్రం సోమవారం నియమించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెళ్లనున్నారు.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఫిబ్రవరి 22న అమృత్సర్లోని గురుదాస్పూర్లో 'రైల్ రోకో' నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం, చెరకు బకాయిలు, ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుబాలకు పరిహారం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై రైతులు నిరసన చేపట్టనున్నారు.
elder woman feeding husband:ఓ వృద్దురాలు తన భర్తకు ఆప్యాయంగా అన్నం తినిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఇదే మరీ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.
school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ ఉంటుందని ప్రకటన చేశారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral News : పులిని వేటాడం గురించి విని ఉంటారు. కానీ... పులిని చంపి.. దానిని వండుకొని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎవరైనా తింటారా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే తిన్నారు. ప్రకాశం జిల్లా అక్కపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.