• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బోర్డు పరీక్షలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

KMM: ఖమ్మం జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ లోపు కేంద్రానికి చేరుకోవాలన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

బావను నరికి చంపిన మరదలు

TG: మొగిలయ్య(70) అనే వ్యక్తి తన మరదలు(50) నరికి చంపిన ఘటన హన్మకొండ జిల్లా హాసన్‌పర్తిలో జరిగింది. భార్య చనిపోవడంతో మొగిలయ్య తన మరదలితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణ అతడి మరదలు చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 05:30 PM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు పానగల్ మండలంలోని బహదూర్ గూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం కొత్తపేటలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన ఆయన చేశారు. మహ్మదాపూర్, కొత్తపేటల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలకు మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

February 24, 2026 / 05:30 PM IST

జనగణన-2027 రాజ్యాంగబద్ధమైనది: కలెక్టర్

NLR: సాధారణ కోవిడ్, కుటుంబ సర్వేల కన్నా, జనగణన-2027 సర్వే రాజ్యాంగబద్ధమైనదని దానిని క్రమ పద్ధతిలో నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని హరినాధపురంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

మార్చి 3న విఘ్నేశ్వరుని ఆలయం మూసివేత

కోనసీమ: మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కారణంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు స్వామి వారికి చేసే అన్ని సేవలు ఉదయం 9 గంటల వరకు మాత్రమే జరుగుతాయని, 9.30 గంటల నుంచి ఆలయం మూసివేస్తామని పేర్కొన్నారు. మరునాడు ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

‘భూసేకరణ వేగవంతం చేయాలి’

VZM: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ పూర్తి కావాలన్నారు.

February 24, 2026 / 05:29 PM IST

‘ఆశ వర్కర్ల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి’

WGL: ఆశ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని BRTU ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వైద్య కార్యాలయం సూపర్డెంట్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటో తారీకు జీతం అందిస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు వేతనాలు అందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు.

February 24, 2026 / 05:27 PM IST

‘రోడ్డు భద్రతలో మహిళల పాత్ర కీలకం’

ADB: ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలంటే మహిళలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సిరికొండ ఎస్సై పూజ అన్నారు. “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంట్లోని వారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా మహిళలు ప్రోత్సహించాలని కోరారు.

February 24, 2026 / 05:27 PM IST

జాబ్ మేళాకు 242 మంది హాజరు

AKP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం రిషి డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళకు 242 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం 108 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్లేస్‌మెంట్ అధికారి పప్పల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:26 PM IST

బాధిత కుటుంబానికి యువ నేత భరోసా

MLG: మండలంలోని చేరుపల్లి (కొత్తపేట) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ బాబాయి సోదరుడు, పార్టీ నాయకుడు ముత్తినేని వసంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం దశదిన కర్మకు కాంగ్రెస్ యువ నేత కుంజా సూర్య హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 05:26 PM IST

రైల్వే, రహదారి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

TPT: జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, శ్రీ సిటీ పరిశ్రమల విస్తరణకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులను గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

February 24, 2026 / 05:25 PM IST

కొనసాగుతున్న కేబినెట్ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. SIPB, CRDA ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులు, నెల్లూరు జిల్లాలో మహిళల కోసం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖలో సెమీ కండెక్టర్ పరిశ్రమ ఏర్పాటు, వివిధ సంస్థలకు భూకేటాయింపుల అంశాల పైనా చర్చించి నిర్ణయం తీసుకునన్నట్లు సమాచారం.

February 24, 2026 / 05:25 PM IST

‘పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి’

PPM: రీ సర్వే జరుగుతున్న గ్రామాలలో ఉప తహసీల్దార్, సర్వేయర్ల డిప్యూటేషన్లు ఉంటే, వాటిని రద్దు చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. రెవెన్యూ, తదితర అంశాలపై అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు.

February 24, 2026 / 05:25 PM IST

సొసైటీ ఉద్యోగులు నిరవధిక సమ్మె

W.G. గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సోసైటీ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయలేకపోవడం సిగ్గు చేటని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ విమర్శించారు. మంగళవారం తణుకు కోర్టు వద్ద 9వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా “నడి రోడ్డు మీద పడుకొని దణ్ణం పెడుతూ.. సహకార సంఘాల JAC ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జీవో. 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలన్నారు.

February 24, 2026 / 05:24 PM IST

జిల్లాలో మెగా జాబ్ మేళా..!

ELR: వట్లూరులోని టీటీడీసీ వెలుగు కార్యాలయంలో ఈ నెల 26న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ గణపతి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆ రోజు ఉదయం నేరుగా కేంద్రానికి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చు.

February 24, 2026 / 05:23 PM IST