VSP: నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఓపీ పెంచి సకాలంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించి పలు వార్డులను పరిశీలించారు. భవనంలో కొన్ని చోట్ల బీటలు ఉన్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆమె సూచించారు.
BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని MLA గండ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం IDOC కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, TGMDC, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, TGMDC శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
SRPT: సూర్యాపేట జిల్లాలో ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
T20 WCలో సౌతాఫ్రికాపై భారత్ భారీ తేడాతో ఓటమిపాలవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురవడం సహజమని, ఇది జట్టుకు అలర్ట్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ వంటి కీలక స్టేజ్లో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నా అని అన్నాడు. ఈ ఓటమితో జట్టు తన గేమ్ ప్లానింగ్ చేసుకుని విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నాడు.
ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు నిన్న పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పలు అంశాలపై ఎంపీతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, జిల్లా కార్యదర్శి రమణాచారి, తదితరులు ఉన్నారు.
ASF: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ITDA ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యా యులను ఆదేశించారు. ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల, సిర్పూర్ ఈఎంఆర్ఎస్, కాగజ్ నగర్ బాలుర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, విద్యార్థులకు మెరుగైన భోజనం, వైద్యం అందించాలని సూచించారు.
కృష్ణా: పామర్రు మండలం బలిపురం గ్రామం NH–65 వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా, రోడ్డు భద్రత అవగాహన ఫ్లెక్సీను పోలీసులు మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ శుభకర్ మాట్లాడుతూ.. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. జాతీయ రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
MNCL: పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని TGNPDCL మంచిర్యాల SE రాజన్న వెల్లడించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా TGNPDCL పని చేస్తుందన్నారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 429 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
SRD: జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, మాట్లాడారు. “మత్తు వదలండి – మైదానానికి రండి.. మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం రేపటి తరానికి ప్రాణవాయువు కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
SKLM: డా బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో NSS ఆధ్వర్యంలో వచ్చే నెల 5న వికసిత్ భారత్ యువపార్లమెంట్-2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీసీ రజని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ అడ్డయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ , మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ ఉన్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ శరత్ చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో కృపాకర్ రెడ్డి జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడిగా, భూలోక విజయకాంత్ రావు ప్రధాన కార్యదర్శిగా, సురేందర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రసూల్ తెలిపారు. పట్టణంలోని విరువూరు రోడ్డు, ఎర్ర చేలు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాలలో కరెంట్ నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 25న జీల్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఉద్యోగ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ఛైర్మన్ నరసింహారావు తెలిపారు. ఏదైనా డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.18 నుంచి రూ.20 వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలకు 9912046234, 9849712739లను సంప్రదించాలన్నారు.
ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యువతకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.