AKP: నర్సీపట్నంకి చెందిన PRTU జిల్లా అధ్యక్షుడు డి. గోపీనాథ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ కో ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పలువురు ఉపాధ్యాయులు ఆయన కలిసి అభినందించారు. అనంతరం గోపీనాథ్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన డీఆర్ బకాయిలు, ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ప్రకటన, ఇతర సమస్యలు మీద పోరాటం చేస్తామన్నారు.
TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని బాట గంగమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్ల పర్వతం వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
NGKL: జిల్లాలో దివ్యాంగుల గుర్తింపు, UDID నమోదు కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. మార్చి 5 నుంచి 31 వరకు వివిధ తేదీల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరాలు కొనసాగనున్నాయి. అర్హులైన దివ్యాంగులు అవసరమైన వైద్య పత్రాలు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరై నమోదు చేసుకోవాలని సూచించారు.
PPM: పరిమితికి మించిన శబ్దాలు, ధ్వనులు వినడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తుతాయని DMHO డా.ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినం సందర్భంగా ఆరోగ్య కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నిత్య జీవన విధానం, శైలిలో వినికిడి ఙ్ఞానం ద్వారా మనం మాట్లాడటం, నేర్చుకోవడం, వినడం, ప్రమాదాలను పసి కట్టటం జరుగుతుందన్నారు.
JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు 9 గ్రామాల్లోని 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు 10 గ్రామాల్లోని 93 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
KMM: హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.
SRPT: మోతే మండలం విభళ్లపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలేని నిర్మాణంతో ఇళ్లలో చీలికలు ఏర్పడగా, కరెంట్, త్రాగునీరు వంటి వసతులు లేవని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వర్షాల సమయంలో బురద, దోమలు, పాముల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
ATP: తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యలను అధిగమించి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
WNP: ఘనపూర్లోని శ్రీ బజారు ఆంజనేయస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ఆధ్వర్యంలో 76వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ASF:కెరమేరి మండలం పెద్దబండ అటవీ ప్రాంతంలోని భీమన్నగుడి,నీటి కుంటల వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు. FDO అప్పయ్య మాట్లాడుతూ.. భక్తులు ప్లాస్టిక్ వ్యర్ధాలను అడవిలో పారేయకుండా వెంట తీసుకెళ్లాలని సూచించారు. వంటలు చేసుకున్న వారు మంటలను పూర్తిగా ఆర్పివేయాలని, లేనిపక్షంలో అగ్నిప్రమాదాల వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు.
TG: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు.
NTR: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసనగా జగ్గయ్యపేటలో సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయు మండల కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు జీతాలు పంచమంటే అరెస్టులు చేయడం దుర్మార్గమని, తక్షణమే ప్రభుత్వం జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
PDPL: ధర్మారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఇవాళ ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంగుల హోలీ సందర్భంగా అందరి జీవితాలు రంగులమయం కావాలని ఆకాంక్షించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తేడా లేకుండా వేడుకలో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
BHNG: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు (కవాటబంధనం). రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం వంటి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. భక్తులు ఈ విజ్ఞప్తిని గమనించాలని ఆయన కోరారు.
SRD: హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీకు చెందిన ఎం. అనూష ఫార్మాస్యూటికల్ పరిశోధనలో పీహెచ్డీ పొందారు. బయోలాజికల్ మ్యాట్రిక్స్లో ఔషధాల అంచనాకు LC-MS/MS పద్ధతుల అభివృద్ధిపై పరిశోధన చేశారు. మానవ ప్లాస్మాలో అస్కిమినిబ్, ఫ్రక్విన్టినిబ్, లుర్బినెక్టెడిన్లను ఖచ్చితంగా కొలిచే విధానాలను ఆమె రూపొందించారు.