• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేతో దిశా నిర్దేశం

సిద్దిపేట: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని వీరన్నపేట గ్రామ పాలకవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 03:02 PM IST

ఇంటర్ పరీక్షలు.. 159 మంది గైర్హాజరు

NGKL: ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 159 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

February 28, 2026 / 03:01 PM IST

బీసీ వసతి గృహంలో అమిలినేని తనిఖీ

ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం తనిఖీ చేశారు. గదులు, గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలుగుబంట్ల సంచారం, వీధి దీపాల కొరతపై స్పందిస్తూ వారంలోగా కంపచెట్లు తొలగించి విద్యుత్ దీపాలు వేయిస్తానని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 03:01 PM IST

తగ్గిన కొబ్బరి కాయ ధరలు.. రైతుల ఆవేదన

కోనసీమ జిల్లాలో కొబ్బరి ధర రోజు రోజుకి పతనం అవుతుంది. గత నెలలో ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 21 నుంచి రూ. 24 వరకు పలికింది. కొబ్బరికాయ ధర రూ.16 నుంచి రూ.18కి పడిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడమే ధర పతనానికి కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 28, 2026 / 03:00 PM IST

కుక్కుటేశ్వర స్వామి సేవలో TG హైకోర్టు న్యాయమూర్తులు

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, పగడాల ప్రవీణ్ కుమార్ సందర్శించారు. వారు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ EO జగన్మోహన్ వారికి స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు.

February 28, 2026 / 03:00 PM IST

‘దర్జీల సమస్యలు పరిష్కరించండి’

SKLM: దర్జీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక చేయూత అందించాలని దర్జీలు డిమాండ్ చేశారు. టైలర్స్ డే సందర్భంగా మందసలో శనివారం ర్యాలీ నిర్వహించారు. కుట్టు మిషన్ షాపులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని కోరారు. దర్జీలకు ఉపాధి కరువైందని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2026 / 03:00 PM IST

మహిళా కార్పొరేటర్ల వినూత్న నిరసన

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు వినూత్న డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ కాలపరిమితి ముగింపు సందర్భంగా కార్పొరేటర్ల కోసం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని మేయర్ ప్రతిపాదించగా, మహిళా సభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ ఆటలు కాకుండా విహారయాత్ర ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఏకమై తమ డిమాండ్‌ను వినిపించారు.

February 28, 2026 / 03:00 PM IST

కల్తీ పాలు బాధితులకు అండగా ప్రభుత్వం: మంత్రి నిమ్మల

E.G: కల్తీ పాలు ఘటన నేపథ్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.

February 28, 2026 / 03:00 PM IST

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నం బట్టివాడకు చెందిన తాటికొండ రవీందర్ అనే వ్యక్తి శనివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మృతుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కేంసారం సంపత్ తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

February 28, 2026 / 03:00 PM IST

రాజగోపుర ప్రతిష్టపనలో పాల్గొన్న టీపీసీసీ సభ్యుడు

RR: మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్, సౌభాగ్యపురంలో అలివేలుమంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానములో రాజగోపుర ప్రతిష్ఠాపన మహోత్సవం, కుంభప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మహాత్సవానికి టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 28, 2026 / 02:59 PM IST

ఆంజనేయస్వామి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిన MLA

BPT: చీరాల మండలం ఈపురుపాలెంలో శనివారం ఎమ్మెల్యే కొండయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్టైల్ కట్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అరుణానంద స్వామీజీతో పాటు, భక్తులు పాల్గొన్నారు.

February 28, 2026 / 02:59 PM IST

జడ్పీ పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం

KRNL: ఆదోని(మం) చిన్న పెండేకల్ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో శనివారం హెచ్ఎం శేకన్న ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శేకన్న మాట్లాడుతూ.. అన్ని శాస్త్రాలకు సైన్స్ తల్లిలాంటిదని తెలిపారు. మనిషి జీవితంలో సైన్స్ ఎంతో ప్రాముఖమైనదని తెలిపారు.

February 28, 2026 / 02:59 PM IST

శనగల కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్య గిత్త

NDL: మిడుతూరు మండల కేంద్రంలో NCCF ఏపీ మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల నూతన కొనుగోలు కేంద్రాన్ని MLA జయసూర్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి శనగలను ప్రభుత్వం మద్దతు ధర రూ. 5875తో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 02:58 PM IST

జమ్మూకశ్మీర్ కలని నిజం చేసిన స్పీడ్ స్టర్

జమ్మూకశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో ఆ జట్టు బౌలర్ అఖిబ్ నబీ దార్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్, సెమీస్‌లో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఫైనల్లో కూడా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు.

February 28, 2026 / 02:58 PM IST

పదవీ విరమణ పొందిన అధికారులకు వీడ్కోలు

ELR: సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో అంకితభావంతో పోలీస్ శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్‌తో పాటు పలువురు అధికారులు వారిని సత్కరించి వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందినా, ఎప్పటికీ మన పోలీస్ కుటుంబంలో సభ్యులేనని శేష జీవితం కుటుంబంతో హాయిగా గడపాలన్నారు.

February 28, 2026 / 02:57 PM IST