HYD: నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ 2026 స్పేస్ కన్వెన్షన్ ప్రాజెక్ట్ ఎక్స్ పోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను, ఆవిష్కరణలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఓ రోబో ఆయనకు షేక్యాండ్ ఇచ్చి, స్వాగతం పలికింది. కిషన్ రెడ్డి వెంట పలువురు అధికారులు ఉన్నారు.
TPT: గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణమని, పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే చివరి కోరికగా లేఖలో పేర్కొన్నారు.
GNTR: తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ‘స్వచ్ఛరధం’ కార్యక్రమాన్ని శనివారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఇళ్లలో సేకరించిన చెత్తను స్వచ్ఛరధం వాహనానికి అందజేస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందించే విధానాన్ని అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
కోనసీమ: డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను చిత్తు చేస్తున్నాయనీ మండపేట టౌన్ CI సురేష్ పేర్కొన్నారు. శనివారం మండపేట గౌతమి పుర పాలక సంఘం హై స్కూల్ విద్యార్థులుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తుకు బానిస కావడం ఎన్నో దుష్పరిణామాలకు కారణమవుతున్నాయన్నారు.
కోనసీమ: ఇంటి పన్నులు వసూళ్ళ పై దృష్టి పెట్టి సకాలంలో పన్నులు వసూళ్లు చేయాలని రావులపాలెం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సూచించారు. రావులపాలెం మండలంలోని హౌస్ టాక్స్ కలెక్షన్ తక్కువగా ఉన్న ఈతకోట, దేవరపల్లి, గ్రామాల పంచాయతీలను ఆయన పరిశీలించారు. హౌస్ టాక్స్ కలెక్షన్పై తీసుకోవలసిన యాక్షన్ ప్లాన్, చర్యలపై సంబందిత కార్యదర్శులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
NZB: ఆర్మూర్ పట్టణ శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం మృతి చెందారు. పని నిమిత్తం ఆర్మూర్ వచ్చిన ఆయన, స్వగ్రామం అర్గుల్కు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గంగారాన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతిని ధృవీకరించారు.
పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2025 భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కృష్ణ ఆగ్రో, మైహోం సిమెంట్స్, ఇంధనఎనర్జీస్ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిపై చర్చించారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ తనవంతు చేయూతను అందించారు. ఆయన అన్నదాన కమిటీ సభ్యులకు రూ. 50,016 విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తుందని నగరం ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి అన్నారు. మామిడికుదురు మండలంలోని పెదపట్నం లంక గ్రామంలో నూతనంగా చేపట్టబోయే రహదారి అభివృద్ధి పనులకు ఆమె స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు, యర్రగుంట్ల పాడు గ్రామాల్లో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిరప పంటపై సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త డా. సి.హెచ్. అనిల్కుమార్ మిరపలో కనిపించే నల్ల తామర పురుగు, బొబ్బర తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను వివరించారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 98% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 4,748 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4668 మంది పరీక్ష రాశారు. 80 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
BDK: ఇల్లందు నియోజకవర్గంలోని సింగరేణి గ్రౌండ్లో శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ముగింపు సభ శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ చూపిన బాటలో నేటితరం నడవాలని సూచించారు. వారితో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కుమార్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
‘విష్ణు విన్యాసం’ లీక్ అవ్వడం వల్ల నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారని శ్రీవిష్ణు చెప్పాడు. అందుకే వారం వ్యవధిలోనే తన 2 మూవీలను విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. చెన్నై నుంచి మూవీని లీక్ చేసి, ప్రతి రీల్కు డబ్బుల కోసం వేధించారన్నాడు. ఈ ఒత్తిడి వల్ల 20 రోజుల షూటింగ్ను రాత్రింబవళ్లు శ్రమించి 7 రోజుల్లోనే పూర్తి చేశామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.
AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో 20 కార్మికులు చిక్కుకున్నట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్కు మెదక్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. పట్టణంలోని పిట్లంబేస్కు చెందిన వ్యక్తి ఇంటిపై దాడికి యత్నించారన్న ఫిర్యాదుతో పోలీసులు ఆయనను ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. ఆయన విడుదలపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.