WNP: వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, రాయచూర్, మంత్రాలయం వరకు నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన ఆత్మకూరులో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేయించామన్నారు. రూ.400 కోట్లతో ఆత్మకూరులో శాంతిని సుందరీకరణ చేస్తామని తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం రాజస్థాన్లోని ఉదయ్పుర్లో అత్యంత వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. కాగా, నూతన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
MBNR: కార్పొరేషన్ పరిధిలోని పాత పాలమూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాతూరు కుమార్ మాతృమూర్తి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం వారి నివాసానికి చేరుకుని వారిని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TG: నల్గొండలోని మెడికల్ కళాశాలను ఉత్తమంగా తీర్చిదిద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించామన్నారు. ప్రస్తుతం కాలేజీలో 350 మంది విద్యార్థులు ఉన్నారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని అన్నారు. అలాగే నల్గొండ మున్సిపాలిటీని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు.
NGKL: మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ మతపెద్దల ఆశీర్వాదంతో మున్సిపల్ ఛైర్మన్గా తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్గా బాదం రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమన్వయంతో పనిసేసి, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మూవీలోని ‘ఆయా షేర్’ సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్లో టాప్ ప్లేస్లో నిలిచింది. భారత్, UAEలలో అగ్రస్థానంలో ఉండగా.. US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ట్రెండ్ అవుతోంది. పాటలోని ‘రా ఇంపాక్ట్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ గ్లోబల్ సెన్సేషన్గా మారి...
NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు జెన్కో ఎస్ఈ వి.జగదీశ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 500 క్యూసెక్కులతో మొదలై, 2 గంటల వరకు ప్రవాహం 2,000 క్యూసెక్కులకు పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
SRD: ఇంటి వద్దకే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తలంబ్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. www.tgslogistics.co.in, ఆర్థిక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ల వద్ద రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
CTR: త్వరలో చిత్తూరు పట్టణంలో ప్రారంభించబోయే కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
PLD: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని పల్నాడు జిల్లా DEO రామారావు తెలిపారు. నరసరావుపేటలో ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు, వ్యక్తిగత శ్రద్ధ అందిస్తున్నట్లు చెప్పారు.
CTR: పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు AGPగా బీ.సురేశ్ బాబు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌడేపల్లికి చెందిన ప్రముఖ అడ్వకేట్ సురేశ్ బాబు పుంగనూరు కోర్టులో 20 సంవత్సరాలుగా న్యాయవాదిగా ఉన్నారు. AGPగా మూడేళ్లపాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
NLG: కాంగ్రెస్ యువజన నాయకుడు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ జన్మదిన వేడుకలను చిట్యాల కూడలిలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ ఛైర్పర్సన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన సైదులు, దేశపాక రాజేష్, కృష్ణ కొసనం అశోక్ పాల్గొన్నారు.
GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గురువారం వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. కావున ఆసక్తి గల వారు తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
SRD: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం(మం) పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం 8వ తరం, 12వ మఠాధిపతులు వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లాలోని కాంగ్రెస్, TDP, YCP నేతలు పాల్గొన్నారు. పీఠాధిపతులు వెంకటాద్రి స్వాములవారి హయాంలో బ్రహ్మంగారిమఠం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.