నాగర్కర్నూలు జిల్లా కుమ్మెరలోని మల్లన్న జాతరలో కుల వివక్షతో రజక సంఘం కుటుంబంపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దొమ్మాట యువకులు అన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో యువకులు పసికందు మృతికి నిరసనగా గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
NLR: నెల్లూరు నగరం ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కోసం డయల్ యువర్ డీఎం గురువారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ప్రజలు కాల్ చేసి సలహాలు ఇవ్వడంతో పాటు సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని DM వెంకటేశ్వర్లు సూచించారు. 9959225641 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.
AKP: పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్కు బదిలీ అయింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఆదేశాలు భారీ చేశారు. ఈ మేరకు ఆయనను ప్రభుత్వం గుంటూరు జిల్లా మంగళగిరి హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
KNR: ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని ఏంఈవో రవీంద్రచారి అన్నారు. సైదాపూర్ మండలం వెన్కేపల్లి హైస్కూల్లో భౌతిక, జీవశాస్త్ర టీచర్స్కి ‘బెలూన్ కార్ ఛాలెంజ్’ పై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రయోగాత్మక బోధనతో పిల్లలు సులభంగా నేర్చుకుంటారన్నారు.
KNRL: ఉమ్మడి జిల్లాలోని పత్తి కొండ RDO భరత్ నాయక్, ఆత్మకూరు RDO దేశిరెడ్డి నాగజ్యోతి బదిలీ అయ్యారు. వీరిని తక్షణమే రిలీవ్ చేయాలని, రిలీవ్ అయిన వెంటనే JADలో రిపోర్టు చేసుకోవాలని జీఓ ఆర్టీ నంబర్ 477ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విడుదల చేశారు. వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతరులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
TG: వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. చెన్నారావుపేట మండలం లింగగిరిగుట్టలలో ఎలుగుబంటి సంచారించడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NGKL: జిల్లా పదర మండల కేంద్రానికి నేడు పలువురు ఎంపీలు మల్లురవి, అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పర్యటిస్తారని యాదవ సంఘం నేతలు తెలిపారు. గత నాలుగు రోజులుగా పదరలో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.
SKLM: మంగళగిరిలోని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్యని పలాస ఎమ్మెల్యే శిరీష బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలాసలో నిర్మించునున్న ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశాలున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆయనకు తెలిపారు.
SRPT: పోలీస్ లాకప్లో మృతి చెందిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈనెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య బృందం ఆధ్వర్యంలో కోదాడలో ఈ ప్రక్రియ జరగనుంది.
MNCL: కన్నెపల్లి మండలం నాయకంపేట గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఒడ్డెటి పద్మ-అశోక్, గ్రామస్థులు కోరారు. ఈ మేరకు SIకి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. NREGS కింద రూ. 5 లక్షల విలువగల CC రోడ్డు మంజూరు కాగా రోడ్డు పని ప్రారంభించే సమయంలో ముగ్గురు వ్యక్తులు పనులు అడ్డుకొని గొడవ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
CTR: బెంగళూరు-నాయుడుపేట జాతీయ రహదారిలో పి.కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీపురం వద్ద సర్వీస్ రోడ్డు గుంతలతో దెబ్బతింది. మూడు నెలలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఈ నెల 27వ తేదీతో ముగియనున్నట్లు ఆయా జిల్లాల మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ నిల్వలను త్వరగా విక్రయించుకోవాలని మార్కెట్ అధికారులు సూచించారు. సీజన్ ప్రారంభంలో ‘కిసాన్ యాప్’ వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PDPL : జేఎన్టీయూహెచ్ అనుబంధ బీ-జోన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను నిన్న సాయంత్రం మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆవిష్కరించారు. ఈరోజు గురువారం నుంచి 12 జట్లతో లీగ్ కమ్ నాకౌట్ విధానంలో పోటీలు జరుగనున్నాయి. పూర్వ విద్యార్థులు, రామగుండం క్రికెట్ అసోసియేషన్, సింగరేణి అధికారులు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.
WNP: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ తెలిపారు. వివరాలు నాగవరం తండాకు చెందిన శ్రీనుతో మేఘవత్ జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.
JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకొని దాడిచేసి రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్లో రజక యువజన కమిటీ ఆధ్వర్యంలో చిన్నారి మృతి పట్ల బుధవారం కొవ్వత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.