W.G: ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. గత సంవత్సరం డిగ్రీ ఫైనల్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేలు నగదు బహుమతిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కె.సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతి పూర్తి చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అన్ని విభాగాల అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
TPT: సత్యవేడులో రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు, దోపిడి పెరుగుతున్నాయని, సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
TG: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అరెస్టై సంగారెడ్డి జైలులో ఉన్న BRS కార్యకర్తలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రచార సమయం ముగిసినా తర్వాత కూడా కాంగ్రెస్ MLAలు ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు డబ్బు పంపిణీ చేసేందుకు పోలీసులు దగ్గరుండి సహకరించారన్నారు. అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు.
NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సరస్వతి జనార్దన్ తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలపై విచారించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ పావనిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ: శాలిగౌరారం మండలం మాదారం కలాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుండి నకిరేకల్ వైపు భైక్పై వస్తున్న ఊట్కూరి వీరయ్య డివైడర్ను ఢీకొట్టడంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ సిబ్బంది వెంటనే చేరుకుని గాయపడిన వీరయ్యను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంథ్రోపిక్ క్లాడ్.. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. అది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. ఈ పోస్టుతో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు 5-9 శాతం మేర కుంగాయి. మొత్తంగా మదుపర్ల సంపద 10 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
HNK: వర్దన్నపేట మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి విజయ ప్రథమ వర్ధంతి కార్యక్రమం హంటర్ రోడ్డులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ చిత్రపటం వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాణాప్రతాప్ తదితరులున్నారు.
WGL: ఖానాపురం(M) బుధరావుపేట గ్రామంలో ఇవాళ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో మొదటి ఏడాదిలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలిపారు.
NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో, పార్టీ కార్యకర్త నగిరికంటి రమేష్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాబహుకరణ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలసి చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
TG: కామారెడ్డిలో జరిగింది ఇది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందు ఉందని BJP MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. తాను ఎవ్వరినీ రావొద్దంటేనే.. పరిస్థితి ఇలా ఉందని.. ఒకవేళ తానే పిలుపు ఇస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కాలేజీ భూముల విషయంలో దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు తెలుసన్నారు. రేపట్నుంచి గ్రామాల్లో తిరుగుతాని.. తనపై చిన్న గీత పడినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
HYD: పల్లెచలుక తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎన్ ఫోర్స్ మెంట్, సరూర్ నగర్ డీటీఎఫ్, అమనగల్ ఎక్సైజ్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. 8 లీటర్ల నాటుసారా, 580 లీటర్ల బెల్లం పానాకం ధ్వంసం చేశారు. ఇస్లావత్ హిరియా సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, మరో నలుగురిపై కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు.
PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతమని కొనియాడారు. ఇటీవల జరిగిన కోటప్పకొండ తిరునాళ్లను తాను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశామని గుర్తు చేశారు.
SRD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. సర్పంచ్ దిలీప్ కుమార్ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.