CTR: జీడీనెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు శనివారం పంపిణీ చేయునట్లు ఎంపీడీవో మనోహర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేస్తామన్నారు. మండలంలో 10,713 మంది లబ్ధిదారులకు రూ.46,01,4500 అందిస్తామన్నారు.
SDPT: చేర్యాల పట్టణానికి చెందిన చుంచు వివేక్ అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, అతని పేదరికాన్ని గమనించి ‘చేర్యాల అంబేద్కర్ నగర్’ సభ్యులు అండగా నిలిచారు. దాతల నుంచి సేకరించిన రూ.24,000 నగదును శుక్రవారం వివేక్ కుటుంబానికి అందజేశారు. ఆపద కాలంలో స్పందించి ఆర్థికంగా సహకరించిన ప్రతి దాతకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. కోవూరులోని జనసేన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్వీర్యంతో పాటు, గంజాయి రవాణా చేసిందన్పనారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుండు పందెం పోటీలను ఏర్పాటు చేశారు. పోటీలలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆధ్యాత్మికతతో పాటు సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పోటీలను ప్రారంభించారు.
కృష్ణా: మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో శుక్రవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గౌడపాలెంలో రూ.10.65 లక్షలు అంచనాతో 165 మీటర్లు పొడవైన్ అంతర్గత రహదారి నిర్మాణ పనులను సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి శుక్రవారం ప్రారంభించారు. నాయకులు రావి రత్నగిరి, చందన రంగారావు, నాగాయతిప్ప సొసైటీ ఛైర్మన్ బల్లా సీతారామ ప్రసాద్, బాల కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
MLG: బండారుపల్లి 12వ వార్డులో ఇందిరమ్మ ఇంటికి నిర్మాణానికి ములుగు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవిచందర్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో ప్రభుత్వం నియమ నిబంధనలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు.
NGKL: కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని నాయకులు నరసింహ, స్వరూప మండిపడ్డారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
VKB: తమ పట్టా భూములను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుందంటూ పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. భూమి కోల్పోవడంతో తాము రోడ్డున పడ్డామని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉసెండి గిరిజనులు 22 ఏళ్ల తర్వాత గాయత పఖ్నా పండుగను ఘనంగా నిర్వహించారు. పూర్వీకుల మోక్షం కోసం నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో రాళ్లను పాతిపెట్టడం, పాటలు పాడడం వంటి సంప్రదాయాలు పాటిస్తారు. వలస వెళ్లిన వారు తిరిగి రాగా, సామాజిక విందు ప్రత్యేక మార్కెట్తో వేడుకలు ముగిశాయి.
AP: రాష్ట్రానికి మరో కీలక కంపెనీ రానుంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా, జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ ప్రకటించింది. ‘మెట్గ్లాస్ ఇండియా’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘అమోర్పస్ అల్లాయ్ రిబ్బన్’ను సంస్థ ఉత్పత్తి చేయనుంది. తొలిదశలో సుమారు రూ.700 కోట్లతో పెట్టుబడి పెట్టనుంది.
RR: ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించడం సత్యం గెలిచిందనడానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. తప్పుడు అభియోగాలన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసి క్లీన్ చీట్ ఇచ్చిందన్నారు. కవితపై జరిగిన కుట్రలు నేడు పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.
BHNG: ఎం తుర్కపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ సొన్నాయిల రఘు అంగన్వాడీ కేంద్రంలో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పాలు, గుడ్లు, మురుకులు, పెడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోషక పదార్థాలను పిల్లలకు టైం ప్రకారం పెట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య , వార్డు వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.
VKB: నవాబ్పేట్ మండలం ఏక్మామిడి గ్రామ సమీపంలో రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారు. కంకర తేలిపోయి వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. ‘అర్ధాంతరంగా వదిలేసిన రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం’ అని వాహనదారులు వ్యాఖ్యానించారు.
NZB: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది అన్ని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల, మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి అన్ని అన్నారు.