SRCL: చందుర్తి మండలం మరిగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యా యి. మల్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గురువారం రాత్రి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 10 కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన 108 హుటా హుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రాలను ఆసుపత్రికి తరలించారు.
KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకల్ ఫ్లైఓవర్, ఆరెపల్లి, కృష్ణానగర్ ప్రాంతాల్లో పోలీసులు గురువారం దాడులు నిర్వహించి 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మల్లేష్, లక్ష్మిపతి, స్వామిదాస్, సత్యనారాయణ, సత్తయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
MNCL: హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి CM కప్ కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన కరాటే క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. నస్పూరు చెందిన అన్విత 59 కేజీల విభాగంలో కాంస్య పతకం, బెల్లంపల్లికి చెందిన అభిషేక్ 75 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు జిల్లా కరాటే సంఘం ప్రధాన కార్యదర్శి శివమహేష్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు.
WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్ను ఎనుమాముల మార్కెట్లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు.
TPT: తిరుచానూరు సమీపంలోని మహిళా ప్రాంగణంలో నాని కేర్ సర్వీసెస్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా ప్రకటించారు. పదో తరగతి పాస్ అయిన, 25-50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. ఈ కోర్సు వ్యవధి 6 నెలలు కాగా, శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు మహిళా ప్రాంగణంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
KRNL: RU పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు గురువారం 85 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 99 మంది విద్యార్థుల్లో 84 మం ది హాజరయ్యారు. కర్నూలు రవీంద్ర డిగ్రీ కాలేజీలో ఒక్కరు డీబార్ అయ్యారు. అలాగే బీటెక్ పరీక్షలకు 99 శాతం, లా పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.
KRNL: RU పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు గురువారం 85 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 99 మంది విద్యార్థుల్లో 84 మం ది హాజరయ్యారు. కర్నూలు రవీంద్ర డిగ్రీ కాలేజీలో ఒక్కరు డీబార్ అయ్యారు. అలాగే బీటెక్ పరీక్షలకు 99 శాతం, లా పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
KMR: విద్యుత్ ట్రాన్స్ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.
PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన పిట్టల నాగమణి (24), ఆమె కుమార్తె త్రివేణి అదృశ్యమయ్యారని ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో, నాగమణి తల్లి వెంకటరమణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త శ్రీనుతో ఉన్న మనస్పర్ధలే వీరి అదృశ్యానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రకాశం: PRC కమిషన్ ఏర్పాటు, CPS రద్దు, IR ప్రకటన తదితర ఉపాధ్యాయుల సమస్యలపై దర్శిలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు తాళ్లూరు మండల ఉపాధ్యాయ సంఘాలు (APTF) పిలుపునిచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొనాలని కోరారు.
PDPL: మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదారి సాహిత్య సీఎం కప్ టోర్నీలో గురువారం రెండు పథకాలతో మెరిసింది. సిద్దిపేటలో నిర్వహించిన 2025- 26, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-15, 10 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్, 20 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్ పథకాలతో రాణించిందని కోచ్ మ్యాక్స్ వెల్ ట్రావర్ పేర్కొన్నారు. ఆమెని పలువురు అభినందించారు.
WNP: అమరచింత మండలంలోని చిన్న కడ్మూర్లో లబ్ధిదారుడు శ్రీను నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరై ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు ‘సారె’ అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కల నెరవేరుస్తోందని తెలిపారు.
NLR: యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా రాపూరు పట్టణంలో వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. స్థానిక ఎస్సై వెంకట రాజేష్ నేతృత్వంలో సిబ్బందితో కలిసి అవగాహన సదస్సును చేపట్టారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల వాడకం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.
MNCL: మందమర్రిలోని తవక్కల్ హైస్కూల్లో నర్సరీ బాలుడిని పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ చితకబాదారు. అందుగుల పేట గ్రామానికి చెందిన పృద్విక్ తవక్కల్ లో నర్సరీ చదువుతున్నాడు. పృద్విక్ ఒంటిపై ఉన్న దెబ్బలను చూసి విద్యార్థి తల్లిదండ్రులు కరస్పాండెంట్ అజీజ్కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు కరస్పాండెంట్ తెలిపారు.