ICC ఈవెంట్స్లో అత్యధికంగా 20* సార్లు సెమీస్ ఆడిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్తో రేపు ఆడేది భారత్కు T20 WCలో ఆరో సెమీస్ కాగా.. ODI WCలో 8 సార్లు తలపడింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీలో 5, WTCలో 2 సార్లు క్వాలిఫై(ఫైనలిస్ట్) అయింది. ఇక ఆస్ట్రేలియా(18)-న్యూజిలాండ్(18*), ఇంగ్లండ్(16*)-పాక్(16), సౌతాఫ్రికా(15*) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నాయి.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ మంగళవారం ప్రకటనలో తెలిపింది. లోక్ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చని సూచించింది.
KMM: మధిర మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సంపత్ కుమార్ను ఆదేశించారు. ఆట స్థలంలో ఇసుక పోయించి సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
ADB: పండుగ పూట ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉట్నూర్ మండలం హస్నాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లో పనిచేస్తూ, నిండు గర్భిణి అయిన భార్యతో పండుగ జరుపుకునేందుకు జైనూర్ మండలం సొన్ పటేల్ గూడా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
RR: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు.
VKB: మర్పల్లి మండలంలోని పంచలింగాల, సిరిపురం, తుమ్మలపల్లి గ్రామాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కాగా పంచలింగాల యువకులు రసాయన రంగులకు దూరంగా ఉండి, కేవలం మట్టితో హోలీ జరుపుకోవడం విశేషం. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యానికి హాని కలగకుండా సాగిన ఈ మట్టి హోలీ అందరినీ ఆకర్షించింది.
MHBD: కొత్తగూడ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన గుంజేడు ముసలమ్మ అమ్మవారి మహాజాతర బుధవారం నుంచి 6 తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతర కోసం దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
TPT: ఎండలు భగ్గుమన్న వేళ నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ భారీగా పెరగడంతో మన ప్రాంత నిమ్మకాయలకు మంచి మార్కెట్ దక్కుతోంది. ప్రస్తుతం కిలో నిమ్మకాయలు వంద వరకు పలుకుతుండటంతో బాలాయపల్లె రైతులకు లాభాలు చేకూరుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, నిమ్మరసం వినియోగం అధికమవడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని వ్యాపారులు చెబుతున్నారు.
NDL: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. ‘కృతజ్ఞతకు, ఆశకు పోటీ పెడితే ఆశే గెలుస్తుంది. ఆ ఆశను కూటమి సృష్టించింది. ఆ ఆశతోనే ప్రజలు మోసపోయారు. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవడం ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి. జగన్ చేస్తున్న సంక్షేమం అంతా అనవసరమైనదని ప్రచారం చేసి, ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశ’ పెట్టారన్నారు.
GDWL: షాద్నగర్ పరిధిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వసతి గృహ విద్యార్థి రాజు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. హోలీ సందర్భంగా స్నానానికి వెళ్లిన అతను తిరిగి రాలేదు. మృతుడు గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. కుమారుడు క్షేమంగా రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
MHBD: వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుందని కొత్తగూడ FRO వజహాత్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని రేంజ్ పరిధిలోని కార్లాయి, బత్తులపల్లి సెక్షన్ అధికారుల ఆధ్వర్యంలో పోలరం కస్తూర్బా పాఠశాలలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26, 2026న విడుదల కానుంది. మార్చి 22న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను అత్యంత భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ కోసం పవన్ స్వయంగా రెండు రోజులు కేటాయించారనే వార్త సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. పవర్ స్టార్ ప్రచార బరిలోకి దిగడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
NDL: చాగలమర్రి మండలం కృష్ణంపల్లెలో వెలసిన ప్రసిద్ధ జమల్ వలి స్వామి ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభించనున్నట్లు దర్గా నిర్వాహకులు వెన్నపూస పుల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఉరుసు కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
JN: జగద్గిరిగుట్ట నుంచి జనగామ డిపోకు చెందిన RTC బస్సులో ప్రయాణించిన ఓ కుటుంబం స్టేషన్ ఘనపూర్లో దిగుతూ పర్స్ మరిచిపోయింది. అందులో మొబైల్ ఫోన్, తులం బంగారం, రూ.400 నగదు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్యాసింజర్ అనంత రెడ్డి గుర్తించి ఆ పర్స్ను కండక్టర్ కుమార్, డ్రైవర్ రాములుకు అప్పగించారు. వారు యథావిధిగా బాధితులకు ఇచ్చారు.
శ్రీకాకుళం పట్టణంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. డయేరియా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణంలో 50 డివిజన్లు పరిధిలో పారిశుద్ధ్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులను జాయింట్ కలెక్టర్, ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ కొనసాగిస్తున్నారు.