తన వ్యక్తిగత జీవితం గురించి నటి అమలా పాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. జగత్ దేశాయ్తో డేటింగ్ ప్రారంభించిన నెల రోజులకే తాను గర్భం దాల్చినట్లు తెలిపింది. ఆ తర్వాతే 2023 నవంబర్ 5న తమ వివాహం జరిగిందని, 2024 జూన్ 11న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
ASF: బెజ్జూర్లో తపాళా శాఖ సేవలపై అవగాహన కల్పించే బ్రోచర్లను సర్పంచ్ సరోజనతో కలిసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నితిన్ శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఉత్తరాల పంపిణీతో పాటు స్పీడ్ పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, సుకన్య సమృద్ధి యోజన, పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్సిబిషన్ వేడుకలను మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రమ-నాగేశ్వర్ రావు శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు తయారుచేసిన వివిధ ప్రయోగాలను వీక్షించి అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 8వ వార్డులో మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మి సైదులు, శనివారం కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. వార్డులోని సమస్యలను ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ వివరించగా.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, సందీప రాంరెడ్డి పాల్గొన్నారు.
చాలామంది మహిళలు ఇంటి పనులు, ఆఫీస్ వర్క్ వల్లే నీరసపడుతున్నామని అనుకుంటారు. కానీ, దీనికి ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం కావచ్చు. ఇది దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి కేవలం కడుపు నిండా తినడమే కాదు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిరంతరం అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి.
అన్నమయ్య: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తెలంగాణతో చీకటి ఒప్పందం చేసుకొని ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కడపలో రేపు జరగబోవు ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
BDK: భద్రాచలం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఆదివారం పర్యటించనున్నారు. చర్లలో ఆసుపత్రి శంకుస్థాపనతో పాటు, పలు మండలాల్లో సర్పంచుల సన్మానం కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఛైర్మన్ సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట 2, 7వ వార్డులో ఛైర్మన్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఛైర్మన్ తెలిపారు.
PPM: మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాలో క్రీడా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా కె. శ్రీధర్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ (మాస్టర్స్) 100, 200, 800, 1500, లాంగ్ జంప్, షాట్ ఫుట్, డిస్కస్, హై జంప్, జావెలిన్ గుంటూరు డీఎస్ఏ మైదానంలో జరుగుతాయి.
MNCL: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండల పంచాయతీ అధికారి ములకల సత్యనారాయణ మృతి చెందారు. బైక్పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆయన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పేలుడు వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆయన ఆదేశించారు. కాగా, బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఆరుగురు చనిపోయినట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం, ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల తరపున మున్సిపల్ ఛైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకారి నవీన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల పట్టణ అధ్యక్షులు ప్రదీప్ గౌడ్, సెక్రెటరీ శేఖర్, ట్రెజర్ రాజకుమార్, రామారావు, దొంతల రాజ్ కుమార్, మహర్షి, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చైర్పర్సన్ భవాని అధ్యక్షత వహించారు. ఎజెండాలో రూపొందించిన అంశాలను చదివి వినిపించారు. రానున్న వేసవి కాలంలో పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ కు మున్సిపల్ కమిషనర్ కు కోరారు.
VSP: మెడికల్ మాఫియా దోపిడీని వెంటనే అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ డిమాండ్ చేశారు. శనివారం బుల్లయ్య కాలేజీ ఎదురుగా డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, ప్రైవేట్ దవాఖానల్లో అవసరం లేని పరీక్షలు, భారీ ఫీజులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.