MNCL: జన్నారం మండలంలోని చింతగూడా, పోన్కల్ పీఎసీఎస్ల ద్వారా రైతులకు యూరియా బస్తాలను అందజేస్తున్నామని చింతగూడ పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. చింతగూడ, పోన్కల్ పిఎసిఎస్ లకు 266 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు బస్తాలను అందజేస్తున్నామని తెలిపారు. మంగళ, బుధవారాలలో యూరియా బస్తాలు రానున్నాయని తెలిపారు.
KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరుకుతుందని, మళ్లీ ఇవ్వనవసరం లేదన్నారు. డివిజినల్, నియోజకవర్గస్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.
NRPT: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండుమల్ మండలానికి చెందిన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు చలో హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హతను బట్టి సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని, మీటర్ రీడింగ్ తర్వాత 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు.
కోనసీమ: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో అటువంటి ఘటనలు జరగకూడదని ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.
VZM: ఎవరి వద్దనైనా వీల్ చైర్లు నిరుపయోగంగా ఉంటే నిరుపేదలైన రోగులకు అందజేయాలని ఆల్ ఇండియా బాడీ ఆర్గాన్స్ డొనేషన్స్ అసోసియేషన్ ఏపీ జనరల్ సెక్రెటరీ షిణగం శివాజీ సోమవారం కోరారు. విజయనగరానికి చెందిన సైలాడ శ్రీదేవి తన తండ్రి మృతి చెందడంతో ఇంటిలో వృధాగా ఉన్న బాత్రూం స్టాండ్ కలిగి ఉన్న వీల్ చైర్ను గరివిడి కొండ శంభాం చెందిన నిరుపేద రోగి రామారావుకు అందజేశారు.
SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది ఒడ్డున చరిత్ర కలిగిన శ్రీ నీలకంటేశ్వర స్వామి పాల్గొనమాసం చతుర్దశి సోమవారం ప్రత్యేక అలంకరణతో పూజలు అందుకున్నారు. పాతపట్నం పరిసర ప్రాంతాలతో పాటు ఒడిస్సా రాష్ట్రం గజపతి ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని స్వామిని దర్శించారు. భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు.
HYDలో ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతి, ప్రశాంతత కోసం కీసర ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పట్టణ యువత జాలిగా గడిపిస్తుంటారు. కీసర కనుచూపు మెరలో పచ్చని పంట పొలాలు, ప్రస్తుతం అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అక్కడికి వెళ్లిన యూత్, రైతులతో మాట్లాడుతూ.. పచ్చని పైరుగాలని ఆస్వాదిస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నట్టు తెలిపారు.
తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరును ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జులైలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ నటన, వెంకీ స్టైల్ మేకింగ్పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.
MBNR: బాలానగర్ మండలం చింతకుంట తండాలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు.
ప్రకాశం: ఒంగోలులో కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజా బాబు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో శ్రీ అల్లా బకాష్ మియా ఉర్సును పురస్కరించుకుని ఈ నెల 5న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గెలుపొందిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.16,016, రెండోది రూ.12,016, మూడోది రూ. 8,016, నాలుగోది రూ.4,016గా నిర్వాహకులు తెలిపారు.
VSP: అతిసార వ్యాధి సోకకుండా పిల్లల రక్షణకు జాగ్రత్తలు పాటించాలని విశాఖ జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ సూచించారు. సబ్బు, నీటితో చేతులు శుభ్రంగా కడగాలని, శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలని సూచించారు. మొదటి ఆరు నెలలు పిల్లలకు తప్పనిసరిగా తల్లి పాలు మాత్రమే తాగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎల్లప్పుడూ మరుగుదొడ్డిని ఉపయోగించాలన్నారు.
SRCL: బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కావ్య (7)కు చేయి విరగగా, అపర్ణిక (6), తీర్థాల కనకయ్య (55) గాయపడ్డారు. మూడు కుక్కలకు రేబిస్ సోకినట్లు సమాచారం. గ్రామస్తులు చర్యలు తీసుకున్నప్పటికీ, మరో రేబిస్ కుక్క ఇంకా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
KMM: కామేపల్లి మండలం ముచ్చర్లలో అడవి పంది మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముచ్చర్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 8 కిలోల మాంసాన్ని కొనుగోలు చేసి పంచుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిల్ప, బీట్ ఆఫీసర్ నాగరాజు సోమవారం తెలిపారు.
BDK: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పేదలకు ఉపాధి పనులు ఇవ్వకుండా అపడాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సోమవారం పాల్వంచలో బి.చిరంజీవి అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముడిపెట్టి పేదల పొట్టకొట్టే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.