AP: రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వసంత రుతువుకు స్వాగతం పలికే రంగుల సంబరం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. పేదా- పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు చూడకుండా రంగుల్లో అంతా కలిసిపోయి ఆనందాలను పంచుకునేది హోలీ పండుగ’ అని ట్వీట్ చేశారు.
VZM: గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచ్లను జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఘనంగా సత్కరించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీపిక, జడ్పీటీసీ తౌడు పాల్గొన్నారు.
AP: ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. తిరువూరు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేణుగోపాలస్వామి కళ్యాణ కార్యక్రమాన్ని చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. SC ఎమ్మెల్యే నియోజకవర్గంలో అతని రుబాబు ఏంటని ప్రశ్నించారు. తమ ఐదేళ్ల పాలనలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని చెప్పారు. చంద్రబాబు, పవన్ దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. పట్టణ సమీపంలో ఉన్న అవుకుమెట్ట వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థలాన్ని మంత్రి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ కలిసి పరిశీలించారు. 3,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి బీసీ పేర్కొన్నారు.
ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి(మం) దుగ్గిరాల పార్టీ కార్యాలయంలో ఆయనను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
E.G: నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామ పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ వీణ తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ వేణు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in నుంచి పొందవచ్చని తెలిపింది. హాల్ టికెట్లో పేరు, రోల్ నంబర్, ఫొటో వంటి వివరాలను సరిచూసుకోవాలని.. ఏవైనా తప్పులుంటే పాఠశాల అధికారులకు తెలపాలని సూచించింది. కాగా, మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
TPT: తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కొత్త కండ్రిగ గ్రామానికి చెందిన రాజా, అమరావతికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలు కారణంగా అమరావతి సోమవారం పురుగులు మందు తాగింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
AP: వైసీపీ ప్రభుత్వం తరిమేసిన కంపెనీలు మళ్లీ వస్తున్నాయని మంత్రి DSBV స్వామి తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే ఆయా కంపెనీలు తిరిగి వస్తున్నాయని అన్నారు. విశాఖకు ఐటీ కంపెనీ IBM రావడం శుభ పరిణామం అని చెప్పారు. IBM మూడేళ్లలో రూ.322 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనుందని మంత్రి వెల్లడించారు. IBM కంపెనీ రాకతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.
చంద్ర గ్రహణాన్ని ఎటువంటి ప్రత్యేక పరికరాలు లేకుండా నేరుగా కళ్లతో చూడవచ్చు. సూర్య గ్రహణంలా కాకుండా, దీని వల్ల కంటికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు సూర్యుడి కాంతిని ప్రతిబింబిస్తాడు కాబట్టి ఆ కాంతి తీక్షణత తక్కువగా ఉంటుంది. మరింత స్పష్టంగా చూడాలనుకుంటే బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగించవచ్చు. ఈ ఖగోళ అద్భుతాన్ని ఎటువంటి భయం లేకుండా వీక్షించవచ్చు.
MHBD: నేడు చంద్రగ్రహణం సందర్భంగా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ గేట్లకు తాళం వేశారు. ఆలయ అర్చకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
భారత గోల్డ్ లోన్ మార్కెట్లో ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ధనవంతులు కూడా వ్యాపార పెట్టుబడుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.5 లక్షలకు పైగా రుణాలు మూడింట ఒక వంతు పెరిగాయి. ఇది బంగారం తాకట్టుపై ఉన్న పాత సామాజిక ఆంక్షలను తొలగిస్తూ, రుణాలు తీసుకోవడం ఒక కొత్త వ్యాపార వ్యూహంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.
VZM: తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం విజయవాడలో శాంతి యుత దీక్షలు చేస్తున్నా అంగన్వాడి కార్యకర్తలను అరెస్టులు చెయ్యడం అన్యాయం అని సీఐటీయూ పి.శంకరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
KMM: కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 3 రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ప్రారంభం కానుంది. కుల పెద్దలు డప్పు కొట్టి హోలీని ప్రారంభిస్తారు.