TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియాను సందర్శించారు. అలాగే బటర్ఫ్లై పార్కును ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకంపై చర్చించారు. మైన్ క్లోజర్ జాతీయ ప్రాధాన్యత అంశం అని పేర్కొన్నారు.
NTR: జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు సమర్పించారు.
SDPT: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ప్రభుత్వం అందించే బీమా సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
శిశువు పుట్టిన వెంటనే ఏడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భం నుంచి బయటి ప్రపంచంలోకి రాగానే, శిశువు ఊపిరితిత్తులు తెరుచుకుని సొంతంగా శ్వాస తీసుకోవడానికి ఈ ఏడుపు సహాయపడుతుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మెదడు ఎదిగి భావాలు తెలిశాకే నవ్వు వస్తుంది. అందుకే శిశువు పుట్టగానే నవ్వకుండా కేవలం ఏడుస్తుంది.
MDK: విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని ఆ దిశగా కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంఈఓ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లిలోని నర్సాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ విజయానికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం తాడివారి పల్లి చెక్ పోస్ట్, పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి రహదారిపై చిరుత పులి వాహన దారుల కంట పడుతుందని, రోల్లగుంపాడు నుండి ఫారెస్ట్ చెక్ పోస్ట్ మధ్యలో, ఆశ్రమం దగ్గర చిరుత సంచారం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
GNTR: నిడుబ్రోలు 11వ వార్డు రామ మందిరం ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జాగర్లమూడి నాగేశ్వరావు సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాగేశ్వరావు మృతికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కూటమి నేతలు, శ్రేణులు సంతాపం తెలిపారు. అంతిమ కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు.
జింబాబ్వేపై హెట్మేయర్ 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు బాదాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత WCలో మొత్తంగా 17 సిక్సర్లు కొట్టాడు. దీంతో సింగిల్ T20 WC ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో పూరన్(17)తో కలిసి హెట్మేయర్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఈ మెగాటోర్నీ పూర్తయ్యేలోపు అతడు ఈ రికార్డును మరింతగా మెరుగుపరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
BDK: జిల్లాలోని పలు గ్రంధాలయాల అభివృద్ధికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఇటీవల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సోమవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామానికి చెందిన దబ్బేట శ్రీకాంత్ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ సాంకేతికత ద్వారా ఫోన్ ఉన్న చోటును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ నీలిమా బాధితుడు శ్రీకాంత్ను పిలిపించి ఫోన్ను అందజేశారు.
NRPT: కృష్ణా మండలంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సముదాయ సమావేశంలో MEO నిజాముద్దీన్ పాల్గొన్నారు. వచ్చే రెండు నెలల్లో విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను సమర్థంగా బోధించేందుకు సరైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశం స్థానిక ప్రధానోపాధ్యుడు కిషోర్ అధ్యక్షతన జరిగింది.
KDP: చెన్నూరు-కాజీపేట సరిహద్దులోని సీ. కొత్తపల్లి సమీపంలో సోమవారం రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. ఆహారం కోసం కొండ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన జింక, వేగంగా వస్తున్న వాహనానికి బలయ్యింది. సమాచారం అందుకున్న ఖాజీపేట అటవీ అధికారులు జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మార్చి నెలలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో 5 ఆదివారాలు ఉండటం విశేషం. వీటితో పాటు మార్చి 4న హోలి పండుగ, మార్చి 14న రెండో శనివారం సెలవులు ఉంటాయి. మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 26న శ్రీరామనవమి ప్రభుత్వ సెలవులు ఉండనున్నాయి. మార్చి 31న మహావీర్ జయంతి ఆప్షనల్ హాలీడే.
KNR: చిగురుమామిడి మండలం జడ్పీహెచ్ఎస్ బొమ్మనపల్లికి చెందినటువంటి విద్యార్థులు తాళ్ల రిచిత, బొల్లి విజయ విద్యార్థులు సీఎం కప్లో ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని పీటీ పీ. జ్యోతి తెలిపారు. నల్లగొండ జిల్లాలో 20, 21 తేదీల్లో జరిగిన సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలాడి లక్ష్మణ్ రావు, ఎంఈవో జయప్రద, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.