MDK: బీహార్ నుంచి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుంచి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్కు తరలిస్తుండగా పట్టుకొని స్థానిక స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల వరకు ఉందని పోలీసులు తెలిపారు.
NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, దీని ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంఏవో బాలాజీ పాల్గొన్నారు.
KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచామని ఎస్ఐ తెలిపారు.
MNCL: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ తెలిపారు. నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, శంకరి,మల్లయ్య, సంపత్ దుర్భాషలాడి దాడి చేసి చంపుతామని బెదిరించారు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.
సత్యసాయి: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో టీడీపీ, చంద్రబాబు పాత్ర బహిర్గతమైందని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థకు అనుబంధమని ఇన్నాళ్లు ప్రచారం చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కల్తీ అంశం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
MLG: వెంకటాపూర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని (AO) తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, లింక్ మొబైల్ నెంబర్తో నేరుగా సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతు పథకాలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరని AO స్పష్టం చేశారు.
ఇవాళ న్యూజిలాండ్-పాక్ పోరుతో T20 WC సూపర్-8 రౌండ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక గ్రూప్ దశలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లుగా ఫర్హాన్(220*), నిస్సంక(199*), కుశల్ మెండిస్(182), మార్క్రమ్(178*), ఇషాన్(176*) టాప్ 5లో నిలిచారు. బౌలర్ల లిస్టులో స్కాల్క్విక్(13 వికెట్లు), వరుణ్(9*), ముజర్బానీ(9*), లియాస్క్(9), ఒమర్జాయ్(9) టాప్ 5 ప్లేయర్లుగా ఉన్నారు.
KMR: లింగంపేట్ మండలంలోని గాంధీనగర్లో చిరుతపులి పంజా విసిరింది. రైతు షేక్ రజాక్ పశువుల పాకలో కట్టేసిన రెండు లేగదూడలపై అర్ధరాత్రి చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం అటవీశాఖ అధికారులు రామకృష్ణ, వాసుదేవ్ ఘటనాస్థలిని పరిశీలించి చిరుత దాడిని ధృవీకరించారు. వెంటనే బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు నియోజక వర్గంలోని ఉపాధి హామీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి అని ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. సారవకోట ఎంపీడీవో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
VKB: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పచ్చని పొలాల్లో రైతు నేస్తాలుగా పిలువబడే కొంగలు సందడి చేస్తున్నాయి. పంటకు నష్టం కలిగించే పురుగులు, కీటకాలను ఆహారంగా తింటూ ఈ కొంగలు రైతులకు రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
JGL: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో భాగంగా, 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకాల కింద ఎంపికైన పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, మార్చి 25 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
SDPT: హరీశ్ రావుపై కవిత పోటీకి సిద్ధమవుతుందా..? అనే చర్చ సిద్దిపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. BRS నుంచి బయటకు వచ్చిన కవిత, హరీశ్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనను పార్టీకి దూరం చేయడంలో ఆయన పాత్ర ఉందని, సిద్దిపేటపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సిద్దిపేట ఎవరి అడ్డా కాదు’ అని కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.
NZB: రాష్ట్ర అభివృద్ధికి 2040 ప్రణాళికతో ముందుకెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఇక్కడి బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని కోరారు.
NLG: చందంపేట మండలం బీజేపీ నాయకులను శనివారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. AI సమ్మిట్లో మన దేశ పరువు పోయేలా అర్ధ నగ్నంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ అరెస్ట్లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజి నాయక్ ఉన్నారు.