BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వటపత్రశాయిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. ప్రధానాలయంలో స్వామివారిని వంటపత్ర శాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని ప్రధాన మాఢ వీధుల్లో ఊరేగించారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి 5వ వార్డు పెర్కిట్లో కొత్తగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కౌన్సిలర్ ప్రసాద్, స్థానిక నాయకులతో కలిసి పనుల నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
KMM: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘నెల నెలా వెన్నెల’ 103వ సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది. అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలో హైదరాబాద్ కళాంజలి బృందం ప్రదర్శించే ‘యాగం’ నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కళాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
SKLM: పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరుకట్ల విఠల్ రావు పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆసుపత్రి పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ప్రకాశం: దొంగతనాలే వృత్తిగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగకు 3 నెలలు జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం గిద్దలూరు కోర్టు తీర్పించింది. కంభంకు చెందిన రసూల్ అనే పాత నేరస్తుడు కంభం మండలం నర్సిరెడ్డిపాలెం పోలేరమ్మ గుడిలో ఉండి పగలగొట్టి నగదు దోచుకున్నాడు. అలానే కంభంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ ఎలక్ట్రికల్ షాపులో రసూల్ చోరీకి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.
పెద్దగా అంచనాల్లేకుండా T20 WCలో అడుగుపెట్టిన జింబాబ్వేను సూపర్-8కు చేర్చడంలో బ్లెసింగ్ ముజర్బానీది కీలక పాత్ర. ముఖ్యంగా 4/7 ప్రదర్శనతో కంగారూలు ఇంటి బాట పట్టేలా చేశాడు. ఈ నేపథ్యంలో T20 WC తర్వాత IPL వేలం జరిగితే అతను రూ.20 కోట్లకు పైగానే ధర పలికేవాడని భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. బంతి కొత్త, పాత అని లేకుండా మంచిగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు.
NGKL: జిల్లా లైసెన్స్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్నిశుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లేష్, వైస్ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా దినేష్, కోశాధికారిగా సురేష్ బాధ్యతలు చేపట్టారు. నూతన అధ్యక్షులు మాట్లాడుతూ..సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
NRML: నిర్మల్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుచాడి శ్రీహరి రావు వినతిపత్రం ఇచ్చారు. వెంగ్వపేట చెరువును సాగునీటి, పర్యాటక ప్రాంతంగా మార్చాలని, వాస్తపూర్ జలపాతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. చింతలగుంపు ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు తాజాగా గుర్తించారు. పులి కదలికలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ చిత్రపురి కాలనీలో పర్యటించి సీ అండ్ డీ వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సౌలభ్యం కోసం రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నేక్నంపూర్ చిన్న చెరువు వద్ద అమృత్ 2.0 కాలువ మళ్లింపు పనులను తనిఖీ చేశారు. పాండెనువాగు నుంచి పెద్ద చెరువు వరకు తనిఖీ చేపట్టారు.
SRPT: కోదాడ మండలం దోరకుంట గ్రామంలో రంజాన్ సందర్భంగా శనివారం మసీదు ప్రాంగణంలో శుభ్రత చర్యలు చేపట్టారు. సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో మసీదు ప్రాంగణాన్ని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. రంజాన్లో భక్తులు ఎక్కువగా మసీదుకు హాజరవుతారని, అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
WNP: రేవల్లి మండలం పాత తాండ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ శ్రీను, ఉప సర్పంచ్ సూర్య, ముగ్గురు వార్డు మెంబర్లు, గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు కేశంపేట సర్పంచ్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు, తదితరులు పాల్గొన్నారు.
NRPT: జిల్లాలో రానున్న వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరందించేలా చూడాలని, సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, మోటార్ల మరమ్మతులు సకాలంలో చేపట్టాలని ఆమె సూచించారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. FEB 27న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. 2026 మార్చి 6న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. అయితే FEB 28న శ్రీవిష్ణు మరో సినిమా ‘విష్ణు విన్యాసం’ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు TPCC చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు సంబంధిత జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.