AP: జనసేన సభ్యత్వ నమోదు ప్రణాళికపై ఆ పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధక్లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోందన్నారు. చివరిసారి 12.6 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు Steam Rice సరఫరా చేయనుంది. ప్రస్తుతం అందిస్తున్న సన్నబియ్యం అన్నం ముద్దగా అవుతుండటంతో, విద్యార్థులకు పొడిపొడిగా, రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
BDK: ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం నిర్వహించిన NSS స్పెషల్ క్యాంప్కు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. సేవ చేయడం గొప్ప లక్షణం విద్యార్థి దశనుంచే సేవలు చేసే గుణం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బొజ్జాయిగూడెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.
MLG: CM రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10గం కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు పర్యటనకు ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై CM పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్నెళ్ల తర్వాత జరిగిన MP ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 27 శాతం పెరిగిందన్నారు. కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోందన్నారు.
MDK: శివంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫౌండేషన్, గురుకులం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘ప్రేరణ విజయానికి తొలి అడుగు’ కార్యక్రమ నిర్వహించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధనకు మార్గదర్శనం చేయడానికి కార్యక్రమం చేపట్టినట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు.
PDPL: ధర్మారం మండలం కొత్తూరు అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపీడీవో వేముల సుమలత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ZP పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ సందర్శించారు. మధ్యాహ్న భోజనం, ప్రత్యేక స్టడీ అవర్స్ గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సంగీత పాల్గొన్నారు.
ADB: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు సంచలనం సృష్టించింది. పటిష్టమైన ఆసీస్ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో హర్మన్ప్రీత్ సేన కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ 176 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది. కాగా, ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా జట్టు టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో జీడి తోట దగ్ధం అయింది. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని రైతులు తెలిపారు.
SRCL: గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరవుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు.
KMM: ఎర్రుపాలెం మండలం నారాయణపురంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మధిర మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడారు. ఆయిల్ పామ్ లాభదాయక పంటగా మారుతోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
PPM: ఆర్ధిక స్వాతంత్య్రంతోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము సంపాదించిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవడమే ఆర్ధిక స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ఎవరిపై ఆధారపడనప్పుడే అనుకున్నవి సాధించగలరని, విజ్ఞానంతో పాటు సంపాదించుకునేందుకే చదువు అని అన్నారు.
ELR: స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా తాటియాకులగూడెంలో గ్రామ పంచాయతీకి అందించిన పరిశుభ్రత వాహనం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. గ్రామ పరిశుభ్రత మెరుగుపడేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గణ్ణమడుగు రవికుమార్, సర్పంచ్ వనమా రాంబాబు, పీడీవో ఆరేపల్లి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
TG: HYD పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, PG విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం ఇచ్చారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు.