MNCL: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం KK ఓసీ ఓపెన్ కాస్ట్ లో తమకు ఉద్యోగాలు కల్పించాలని ఓపెన్ కాస్ట్ సింగరేణి ముంపుకు గురైన భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం ఓపెన్ కాస్ట్లో విధుల సమయంలో వాహనాలు రాకపోకలను నిలిపివేసి ధర్నా చేశారు. సమస్యలను అతిత్వరలో పరిష్కారిస్తమని ఓపెన్ కాస్ట్ యాజమాన్యం చెప్పడంతో ధర్నా విరమించారు.
నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ‘రాజకీయాల కోసం హిందూ సంప్రదాయ దుస్తులు ధరిస్తూ, సొంత పిల్లలకు మూడు నెలలకే విదేశాల్లో బాప్టిజం ఎందుకు ఇప్పించారు? ఇది రాజకీయ డ్రామానా?’ అని ఆమె ప్రశ్నించింది. ఇవి కేవలం సందేహాలేనని ఆమె అన్నా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని నెట్టింట చర్చ నడుస్తోంది.
CTR: పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు ఎస్సీ కాలనీలో కొద్ది రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. స్థానికులు అధికారులతో పాటు పలువురు నాయకుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు గ్రామంలో నూతన బోరు డ్రిల్ చేసి సమస్యను పరిష్కరించారు.
AP: సీఎస్ విజయానంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2018 గ్రూప్-1లో ఎంపికై ప్రాధాన్య పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని సీఎస్ ఆదేశించారు. వీరంతా తక్షణమే సంబంధిత HODలకు రిపోర్ట్ చేయాలని, దీనికి సంబంధించి ఇవాళ రాత్రి 7 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.
NZB: ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహింప చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.
PLD: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లు దెబ్బతిని 43 వేల మంది చనిపోయారని ఎమ్మెల్యే పుల్లారావు అసెంబ్లీలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో రోడ్లకు రూ.9,900 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట-నరసరావుపేట, కోటప్పకొండ మార్గాలను విస్తరించాలని కోరారు. ఎన్.హెచ్ 167ఏ, 16 బైపాస్ సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
NTR: విజయవాడ గొల్లపూడిలో నిర్మించనున్న జిల్లా టీడీపీ కార్యాలయాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనురాధతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పార్టీ కార్యాలయం పార్టీ కార్య కలాపాలకు కేంద్రంగా, కార్యకర్తలకు మార్గదర్శ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా నిలిచేలా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.
KNR: మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం KNR కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా అవగాహన శిబిరం నిర్వహించారు.
KMR: పెద్ద కొడప్గల్ మండలం బాబుల్ గావ్ ప్రాథమిక పాఠశాలలో నూతన మరుగుదొడ్డి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ రవి కుమార్ భూమి పూజ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ పని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీర్ గోండా, కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్ రెడ్డి పాల్గొన్నారు.
PDPL: అంతర్గాం మండలం మూర్ముర్లో నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 27న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. మార్చి 1, 2 తేదీలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 66 ఏళ్లుగా గోపు వంశీయులు కొమురన్న పేరుతో ఈ జాతరను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ATP: పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో సోమవారం జరిగిన స్థల వివాదంతో నాగన్న అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ముత్యాలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.
VKB: చౌడాపూర్ మండలం పచ్చవుకుంట తండాలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సామరస్యాన్ని పెంపొందిస్తాయని గ్రామప్రజలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, సర్పంచ్ సవిత రాజు, చౌడాపూర్ సర్పంచ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్, రాము, గ్రామస్థులు పాల్గొన్నారు.
WNP: అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, భక్తుల పిలుపు మేరకు అయ్యప్ప స్వామి దర్శనానికి విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్కి ఘన స్వాగతం పలికారు. వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. విచ్చేసిన భక్తులకు, కమిటీ సభ్యులకు పేరుపేరునా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
NLG: దేవరకొండ ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పాపారాజు, కార్మికులు కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్సీ కోదండరామ్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పూర్తి స్థాయిలో వారి సమస్యలను విని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRCL: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలి రోజు 4209 మంది విద్యార్థులు హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన తొలి రోజు పరీక్షలో 4046 మంది రెగ్యులర్, 283 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 4328 మంది విద్యార్థులకు గాను, 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.