• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాజమండ్రికి చేరుకున్న ఆరోగ్యశాఖ

AP: రాజమండ్రి జిల్లా చౌడేశ్వరినగర్‌కు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ చేరుకుని మెడికల్ క్యాంప్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందగా.. 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 126 కుటుంబాలకు వ్యాపారి పాలు పోశాడు. ఇప్పటికే పాలు, పెరుగు, రక్త నమూనాలు సేకరించాము. ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్ష జరిపారు’ అని తెలిపారు.

February 23, 2026 / 07:28 PM IST

ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

PDPL: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. 22 కేంద్రాలలో 10,367 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.

February 23, 2026 / 07:27 PM IST

‘పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

VSP: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SCC పబ్లిక్ పరీక్షలను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

February 23, 2026 / 07:26 PM IST

ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ

VSP: సింహాచలం ఆలయ పరిధిలోని గంగాధర మార్గంలో వేంచేసియున్న త్రిపురాంతకేశ్వరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పాల్గొని స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజలతో ఐదు రోజుల మహోత్సవాలకు అంకురార్పణ చేశారు.

February 23, 2026 / 07:25 PM IST

అమాసరెడ్డి కండ్రిగ వద్ద రేషన్ బియ్యం పట్టివేత

TPT: సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిగ సమీపంలో అడిషనల్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటకు చెందిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 07:25 PM IST

పార్కులో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

RR: వార్డు అభివృద్ధి విషయంలో నిరంతరం ప్రజల వెంట ఉంటానని షాద్‌నగర్ పట్టణ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ అన్నారు. బాబా నగర్ కాలనీలోని పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 07:25 PM IST

పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

NZB: నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల సమస్యలు విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

February 23, 2026 / 07:22 PM IST

‘గ్రోత్ హబ్ అభివృద్ధికి యంత్రాంగం సిద్ధం’

PPM: నీతి ఆయోగ్ భారత్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సిటీ రీజియన్స్ గ్రోత్ హబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాను అభివృద్ధిలో నడిపించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్స్ కింద జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కమిటీకి జేసీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

February 23, 2026 / 07:22 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: SFI

MHBD: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని MHBD జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బాసు పట్ల మధు డిమాండ్ చేశారు. MHBD జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో SFI ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.

February 23, 2026 / 07:21 PM IST

‘సైబర్ క్రైమ్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి’

CTR: నగరి నియోజకవర్గ పుత్తూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం పంచాయతీలో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, NPS పథకాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు.

February 23, 2026 / 07:21 PM IST

ఫ్లోరైడ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ఇవాళ అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. వేసవికాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కోరారు.

February 23, 2026 / 07:19 PM IST

సత్రంపాడు మెగా జాబ్ మేళా

ఏలూరు: సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులని ప్రిన్సిపల్ భూషణం తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 23, 2026 / 07:18 PM IST

రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే.!

KDP: ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. రూ.80,035లు రాబడి లభించిందని ఆలయం EO శ్రీధర్ తెలిపారు. ప్రొద్దుటూరు టెంపుల్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు సన్నుతి శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, భక్తుల సమక్షంలో హుండీలోని సొమ్మును లెక్కించినట్లు ఈవో తెలిపారు.

February 23, 2026 / 07:18 PM IST

చిన్నారి కుటుంబానికి న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే

NGKL: కుమ్మెర ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ స్పందిస్తూ, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

February 23, 2026 / 07:17 PM IST

గూళ్యం స్వామి జాతరలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ

KRNL: హలహర్వి మండలం, గూళ్యం గ్రామంలో నిర్వహించిన శ్రీ గాదిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివ ప్రసాద్ స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ.. సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ప్రార్థించారు.

February 23, 2026 / 07:17 PM IST