కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణకు శివప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్గా నంద్ కిశోర్ యాదవ్, బీహార్ గవర్నర్గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించింది.
న్యూయార్క్, షికాగో, నెవార్క్ నుంచి ముంబై, ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల ధరలు పెరిగాయి. న్యూయార్క్ (జేఎఫ్కే విమానాశ్రయం) నుంచి ఢిల్లీకి వచ్చే విమానాల్లో ప్రస్తుతం రూ.1.34 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉంటాయి. షికాగో-ముంబై రూట్లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి రూ.1.9 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు చేరాయి.
కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి రూ.25 వేలను భార్య ఖాతాలో జమ చేయాలని ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన హక్కు’ అని జడ్జి పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246/7 రన్స్కే పరిమితమైంది. బెతెల్ 105, బట్లర్ 25, విల్ జాక్స్ 35 రన్స్ చేశారు.
రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు రైళ్లు ప్రయాణించనున్నట్లు ప్రకటించింది. విశాఖ-కొల్లాం ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం ఉ.8:20కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మ.2:50కు కొల్లాం చేరుకుంటుంది. చర్లపల్లి-షాలిమార్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుంచి మంగళవారం ఉ.7:15కు బయలుదేరి మరుసటి రోజు ఉ.11:20కి షాలిమార్కు చేరుకుంది.
AP: మాజీ సీఎం జగన్పై పోరాడినప్పుడు కూడా తనపై దాడులు జరగలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నన్ను భూమిపై లేకుండా చేయాలన్న కుట్రలపై విచారణ చేయాలి. సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా. నన్ను అవమానిస్తే సహిస్తా.. కానీ, నాజాతిని అవమానిస్తే తెగిస్తా’ అని పేర్కొన్నారు.
HYD: సికింద్రాబాద్ ఆలుగడ్డ బావిలో తీవ్రమైన వేడి కారణంగా ఓ వ్యక్తి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. 108 సిబ్బంది EMT స్వర్ణ, పైలట్ వెంకటేశ్ వెంటనే బాధితుడిని అంబులెన్స్లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అంబులెన్స్లోనే వైద్య సహాయం అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం 2వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుక్కల సతీష్ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగర BRS అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సతీష్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.
NZB: కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ గ్రామంలో గురువారం గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఏడు గొర్రెలకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు మల్లేష్ తెలిపారు. కుక్కల దాడి వల్ల సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు నష్టము వాటిలిందని బాధితుడు మల్లేష్ వాపోయాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హుజూర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.లక్షల విలువ చేసే ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమంద రాజు వెల్లడించారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగడానికి ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, విభాగాధికారి సమన్వయంతో వేడుకలు, హెల్త్ చెకప్ శిబిరాలు, మహిళల రక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన కీలకమైన సెమీఫైనల్లోనూ ఘోరంగా విఫలమవడంతో, అతడిని జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకోవడం వల్ల మిగిలిన బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అభిమానులు మండిపడుతున్నారు.
AP: టీడీపీ పనిగట్టుకుని తన ఇంటిపై దాడి చేయించిందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పార్టీలకతీతంగా కాపులు నాకు సంఘీభావం తెలిపారు. కూటమిలో ఉన్న కాపులు కూడా సంఘీభావం తెలిపారు. ఘటనలో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడింది. అదేంటో రాబోయే రోజుల్లో చూస్తారు. నేను అనని మాటలను కూడా రిమాండ్ రిపోర్టులో పెట్టారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియకుండా జరిగాయా?’ అంటూ ప్రశ్నించారు.
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కేవలం 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. అయితే.. సాల్ట్ (5), బట్లర్ (25), బ్రూక్ (7), బంటన్ (17) వంటి కీలక బ్యాటర్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జాకబ్ బెథల్ (43), విల్ జాక్స్ (4) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 71 బంతుల్లో 151 పరుగులు చేయాల్సి ఉంది.
కోణార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటేడ్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు konkanrailway.comను సంప్రదించండి.