TG: మెదక్ జిల్లా రేగోడ్ కస్తుర్భా గాంధీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఆహారం కలుషితమై 10 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో వారు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
VKB: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో తాండూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. పైలెట్తో పాటు మరో ఏడు మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ ద్వారా తాండూరు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ATP: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. రాయదుర్గానికి చెందిన రాజకుమార్, సుదర్శన్ రెడ్డిలకు ఈ పదవులు దక్కాయి. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటంలో వీరి సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కృష్ణా: పెడనలోని ఆటో డ్రైవర్లకు ఎస్సై బషీరా శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డుపై అడ్డంగా ఆటోలను నిలిపివేయకూడదని, ప్రయాణికులను ఎక్కించడం, దించడం కోసం విశిష్ట ప్రదేశాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. స్కూల్ పిక్ సమయాలలో రోడ్లపై క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సహకరించాలన్నారు.
NDL: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సిబ్బంది, శానిటరీ వర్కర్లకు క్షయ (టీబీ) వ్యాధిపై అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాకాతుమ్, సూపర్వైజర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఛాతి ఎక్సరే, స్పిరోమీటర్ పరీక్షల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. కొత్త రోగులను గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వారు తెలిపారు.
PLD: సీఎం చంద్రబాబు శనివారం వినుకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. అక్కడ ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.
SRPT: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాలలో డీఐఈఓ భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సీఎస్డీఓల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రకాశం: కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన ఇంటిలో రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన విషయం తెలిసిందే. అయితే కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలోను అధికారులు సోదాలు నిర్వహించారు.
SKLM: ఆమదాలవలస(మం) కత్యచార్యులపేటకు చెందిన పైడి వరహా నరసింహులు ఆమదాలవలస సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులో ప్రభుత్వం న్యాయవాది(ఏజీపీ)గా సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. ఈయన పలుమార్లు ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఈయనకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
KDP: నందవరం మండలంలోని మాచపురం గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. టిడిపికి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో పలువురు TDP గ్రామ నాయకులు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించిందని బ్లూమ్బెర్గ్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ $717 బిలియన్ల అమ్మకాలు జరపగా, వాల్మార్ట్ $713.2 బిలియన్ల వద్ద నిలిచింది. గత దశాబ్దంలో వాల్మార్ట్ కంటే 10 రెట్లు వేగంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అమెజాన్, రిటైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
W.G: మైనర్ బాలికలు, మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద స్పష్టం చేశారు. మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యమని, నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆమె హెచ్చరించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల ఏ మాత్రం రాజీ పడకుండా బాధ్యులపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.
WNP: నర్సింగయ్యపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎస్సై నరేష్ మానవత్వం చాటుకున్నారు. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అంబులెన్స్ అందుబాటులో లేని పరిస్థితిని గమనించిన ఎస్సై తక్షణమే స్పందించారు. క్షణ కాలం కూడా ఆలస్యం చేయకుండా బాధితుడిని తన బైక్ పైనే ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు.
AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియ.. జరిగిన లోటు పాట్లకు సంబంధించి వన్ మ్యాన్ కమిటీ అధ్యయనం చేయనుంది.
AKP: ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల పీఏసీఎస్ కార్యాలయం మూతపడింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.హెచ్ఆర్ పాలసీని, జీవో36ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని సమ్మెకు దిగారు.