RR: షాద్ నగర్ పట్టణంలోని 20వ వార్డులో తాగునీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. నెలరోజులుగా బోరు పాడు కావడంతో ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజలు ఈ విషయాన్ని కౌన్సిలర్ గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ బోరును బాగు చేయించి తాగునీటి ఎద్దడిని తీర్చారు. దీంతో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమీక్షించారు. జాతరకు నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు.
JGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కం రాజశేఖర్ (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న లక్కం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
AP: లిక్కర్ స్కాం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.
BHNG: రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాడనే కక్షతోనే బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని అన్నారు.
VSP: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులు శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి జే. వెంకట్రావు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు వేదపండితులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం అందించారు.
PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టాస్క్ రీజియన్ సెంటర్ ఆధ్వర్యంలో జావా, వెబ్ డెవలప్మెంట్, సీ, HTML, CSS, జావా స్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్టీ, మొదలైన కోర్సుల్లో ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9059506807లో సంప్రదించాలి.
JNG: బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామ మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు సంఘం సభ్యులు శనివారం తెలిపారు. అధ్యక్షులుగా జుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా చింతపండు బాలకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా గోపాల నర్సిములు, సభ్యులుగా ముదం సిద్దయ్య, జుల భాస్కర్లు, సలహాదారులుగా చింతపండు ఆంజయ్య, మట్టి బిక్షపతి, క్రిష్ణలు ఎన్నికయ్యారు.
MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలు, వీకెండ్ కావడంతో యాదగిరిగుట్టకు భారీగా భక్తులు తరలివచ్చారు.
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో బస్స్టాప్ నుంచి పాఠశాల వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
KMR: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. శనివారం “కొండవెలగాడ – విజయనగరం కుమ్మరవీధి రోడ్ రిసర్ఫేసింగ్” పనులకు ఆమె శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకంగా ఉన్న ఈ రహదారిని పునరుద్ధరించడం తన ప్రాధాన్యత అని తెలిపారు.
E.G: నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెం గ్రామంలో ‘స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛాంద్ర వాహనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తెలిపారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.
ATP: అనంతపురం నగరంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదని తెలిపారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.