SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి కొన్ని రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో మండల పరిషత్తు కార్యక లాపాలు సజావుగా నిర్వహించేందుకు ఉప ఎంపీపీ-2 జరుగుళ్ల విజయ కుమారికి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
NLR: ప్రతి కుటుంబ సమగ్ర వివరాలను సేకరించడమే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ముఖ్య ఉద్దేశమని ఎంపీడీవో రంతులయ్య తెలిపారు. సర్వే అనంతరం ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ ఫ్యామిలీ ఐడిని కేటాయించనున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ సర్వేలో ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.
SRPT: మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో భారీగా నకిలీ పురుగుమందు విక్రయం బట్టబయలైంది. ప్రముఖ కంపెనీ ‘Bayer Nativo’ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు డీలర్ షాపులు, గౌడౌన్లపై శనివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. రూ.3 లక్షల విలువైన నకిలీ ప్యాకెట్లు, పౌడర్తో పాటు రూ.8 లక్షల విలువైన పెస్టిసైడ్స్ను సీజ్ చేసినట్లు తెలిపారు.
KDP: VN పల్లె(M) తలపనూరు గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 26న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి శనివారం తెలిపారు. బహుమతులు వరుసగా రూ. 35వేలు, రూ. 30వేలు, రూ. 25 వేలు,రూ. 20 వేలు, రూ.15వేలు ఇలా 12 బహుమతులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదయం 7 గంటలకే ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.
SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికను కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి మునగాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భింద్ జిల్లాలోని హైవేపై ఓ వ్యాన్ను వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
SDPT: దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మృతుడు వంగ బాల్రెడ్డి (61)ని శుక్రవారం కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ రాజేశ్ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ వివాదంపై పాత విభేదాలు కొనసాగుతుండగా, వంగ రేణుక (55), ఆమె కుమారుడు సోమేశ్వర్ (26) కలిసి బాల్ రెడ్డిని హత్య చేశారని తెలిపారు.
VZM: విజయనగరం మహారాజా అయోధ్య మైదానంలో, ‘మై భారత్’ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు, వాలీబాల్ కిట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.
SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్లో జరగనున్నాయి.
GNTR: గుంటూరు నగరంలో ఆదివారం నాన్వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 190 కాగా, స్కిన్తో రూ. 170కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే కొరమేను రూ. 420, బొచ్చ రూ. 230, రాగండి రూ. 170 ధర పలుకుతున్నాయి. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
పశ్చిమోత్తానాసనం (కూర్చుని ముందుకు వంగే ఆసనం) వెన్నెముకను సాగదీయడం, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనం పొత్తికడుపు అవయవాలను (కాలేయం, మూత్రపిండాలు, పేగులు) మసాజ్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి, మంచి నిద్ర పడుతుంది. వెన్నునొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
VKB: జిల్లాలో ఈరోజు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 280-320 వరకు విక్రయిస్తుండగా, స్కిన్లెస్ చికెన్ రూ.320కు పైగా ఉంది. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NZB: జిల్లా గంగా-జమునా తెహజీబ్కు ప్రతీక అని, అన్ని మతాల వారు సోదరభావంతో ఉండాలని CP సాయి చైతన్య కోరారు. రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రతీ ఒక్కరూ శాంతి యుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలో పోలీసులకు సహకరించాలని సూచించారు.
సత్యసాయి: ధర్మవరం టూటౌన్ పరిధిలో భార్యను చంపేందుకు కుట్ర పన్నిన భర్త దాశరథి, అతని స్నేహితుడు మన్సూర్పై కేసు నమోదైంది. తన భర్తకు, మన్సూర్కు మధ్య అనైతిక సంబంధం ఉందని, ఈ విషయం బయటపెట్టినందుకు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు తులసి ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప శనివారం తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బయో మెడికల్ వ్యర్థాల ట్రాకింగ్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం డాక్టర్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఉన్న ఎక్విప్మెంట్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, అవసరమైన పరికరాలను తక్షణమే ఏర్పాటు చేస్తామని భరోసా తెలిపారు.