ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమై పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాని మోదీ (PM MODI) ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని… ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా(Director of Health) ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.
వివేకా రాసినట్టుగా భావిస్తున్న లేఖ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి సీబీఐ (CBI) ఈ మేరకు వివరాలు సేకరిస్తోంది.
WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్ మాములు వ్యక్తి కాదు. అతనో శక్తి.. ఆరుసార్లు పార్లమెంట్కు ఎన్నికై.. నేరస్థులతో పరిచయం ఉన్న బడా నేత.
ఆస్ట్రేలియా(Australia)లో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాక అత్యాచార దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
స్మగ్లర్లు (Smugglers) చిత్ర విచిత్రమైన మార్గాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా డ్రగ్స్ సరఫరా చేసినా..ఎక్కడో ఓ చోటు దొరికిపోతుంటారు. తాజాగా న్యూజిలాండ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ వృద్ద దంపతులు అడ్డంగా దొరికిపోయారు.
2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్పర్సన్గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
మహారాష్ట్ర(Maharashtra)లో సీఎం షిండే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా..? త్వరలో ఆయన మాజీ కాబోతున్నారా..? ఎన్నికలకు ఏడాది ముందు మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశముందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
అఖిల్ ఏజెంట్(agent) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ సినిమా ఐటెం సాంగ్ రీసెంట్ విడుదల చేశారు. దీనిలో ఊర్వశీ రౌతలా(Urvashi Rautela) ఆడిపాడారు.