SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు వయస్సు గల యువతీ యువకులు అర్హులు అని తెలిపారు.
TG: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి, రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించే అర్హత పరీక్ష ‘టీజీ ఎడ్-సెట్-2026’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహిస్తారు.
VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్లో 20 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు తెలిపారు. ప్రధాన కార్యాలయంలో సీపీలతో కలిసి నిర్వహించిన ఫోరమ్లో భీమిలి–1, మధురవాడ–2, ఈస్ట్–2, సౌత్–3, నార్త్–6, పెందుర్తి–1, అగనంపూడి–1, గాజువాక–4 వినతులు వచ్చాయి. ప్రతి శుక్రవారం ఈ ఫోరమ్ నిర్వహించి ఫిర్యాదులను వేగంగా చర్యలు తీసుకుంటున...
AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారులను విస్తరించనున్నామని MLA బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. సుండిపెంటలో రూ.8 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సున్నిపెంటలో రోడ్ల విస్తరణ మార్చి 15 లోపు పూర్తి చేస్తామన్నారు.
SRD: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలలో మరమత్తులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
TG: రాష్ట్ర వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సాంకేతిక, డిజిటల్ మౌలిక వసతులపై ఏఐ సమ్మిట్లో ప్రస్తావన రావడం గర్వకారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించడంలో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. శాటిలైట్ ద్వారా మట్టి పోషకాలను గుర్తించి, వాటిని ఏఐ మోడలింగ్ ద్వారా విశ్లేషించి పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిదన్నారు.
ASR: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తూ అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కే. లోకనాధం కోరారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పీ. అప్పలనర్స, నేతలు చిన్నయ్య పడాల్తో కలిసి జీకేవీధి మండలం బాక్సైట్ ప్రభావిత ప్రాంతం జర్రెలలో పర్యటించారు. గిరిజన హక్కులు, చట్టాలను ధిక్కరించడం ప్రభుత్వాలకు సరికాదని హితవు పలికారు.
ATP: మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పీ.జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం శక్తి బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, బస్టాండ్లు, కాలనీలలో మహిళలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ అలర్ట్ ద్వారా పోలీసుల సాయం ఎలా పొందాలో వివరించారు.
కృష్ణా: కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థులకు రోడ్డు భద్రత, పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ట్రాఫిక్ నియమాలు పాటించాలి, హెల్మెట్ తప్పనిసరి, ఓవర్స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మొబైల్తో వాహనం నడపడం మానుకోవాలని SI C. H. సురేష్ సూచించారు. అలాగే చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు.
పసికూన ఒమన్పై ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపింది. తొలుత ఒమన్ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లలో మార్ష్ (64*) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, హెడ్ 32 పరుగులతో రాణించాడు. ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. విజయంతో తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది.
AP: YCP పాలనలో జరిగిన అరాచకాలు మర్చిపోలేమని హోంమంత్రి అనిత అన్నారు. ‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించారు. పవన్ను రోడ్డుపై కూర్చోబెట్టారు, బయటకు రానివ్వలేదు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుని దాడికి యత్నించారు. ప్రజావేదిక కూల్చి శకలాలు తీయకుండా సైకోయిజం చూపించారు. పోలీసు వ్యవస్థను శాంతిభద్రతల కోసం కాకుండా రాజకీయాల కోసం పనిచేసేలా మార్చివేశారు’ అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను వైట్హౌస్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి జి. సంపత్ కుమారి శుక్రవారం పర్యవేక్షించారు. గ్రామంలో జరుగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె పరిశీలించి, వసూళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పన్నుల వసూళ్లను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు అందించారు.
TG: ఈ రోజుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో అత్యంత సాధారణ సమస్య. సాధారణంగా జీర్ణవ్యవస్థ నుంచి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. మహిళల్లో పాయువు, మూత్రనాళం రెండూ దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్పై ఉన్నప్పటికీ ఎవరూ దానిని పట్టించుకోరు. అయితే, ఇది ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం ఎముకలను దృఢంగా ఉంచే పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని చెప్పారు.