NZB: పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారులదే(DO) ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రకాశం: మార్కాపురం డీఎల్డీవో బాలునాయక్ కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డుపై జరుగుతున్న చెత్త తొలగింపు పనులను శుక్రవారం పరిశీలించారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు.
SDPT: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ సమంజసం కాదని ఉప సర్పంచ్ల ఫోరం బెజ్జంకి మండల అధ్యక్షుడు దీటి బాలనర్సు అన్నారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసి దూర ప్రాంత జైలుకు తరలించారని ఆరోపించారు. క్యాతన్పల్లి ఛైర్మన్ ఎన్నికను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
TG: యాదాద్రి జిల్లాలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో వ్యాపించిన మంటల్లో కెమిస్ట్ పవన్ చిక్కుకుని మృతి చెందారు. పరిశ్రమలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తోంది.
బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బందర్’. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్గా ఈ ఏడాది మే 22న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేస్తూ.. ‘మే 22న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
AP: విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ భవన్ నమూనాను పరిశీలించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
PDPL: బీహార్లోని బసంత్ పూర్కు చెందిన లాల్ కృష్ణ అనే యువకుడు 8 నెలల క్రితం దేశంలోని వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ ఆయన సైకిల్ యాత్రతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం చేరుకున్నాడు. వీలైన ప్రదేశాలలో సేద తీరుతూ, ప్రతిరోజు 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు.
NLG: చిట్యాల పట్టణంలోని లొయోల టెక్నో స్కూల్లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా మున్సిపాల్ ఛైర్మన్ పందిరి గీత రమేష్, ఎస్సై రవికుమార్లు పాల్గొన్నారు. పాఠశాలలో ‘మాక్ కోర్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో తాత్కాలిక కోర్టు రూం వాతావరణాన్ని ఏర్పరిచారు.
KRNL: పదో తరగతి పరీక్షలను ఇబ్బందులు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల DRO డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నమయ్య: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్నమయ్య జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. రాధిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టీబీ యూనిట్ రికార్డులు, నివేదికలను పరిశీలించి చికిత్స విధానాలపై అధికారులతో సమీక్షించారు. క్షయను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. వైద్య సిబ్బందికి వ్యాధి నిర్మూలనలో మరింత చురుకుదనం అవసరమని పేర్కొన్నారు.
ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ జయమ్మ అనే మహిళ శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గత రెండు వారాల క్రితం పాముకాటుకు గురైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KMM: ధ్యానం శారీరక, మానసిక ప్రశాంతతకు, ఆనందానికి తోడ్పడుతుందని మధిర మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు. శుక్రవారం మాటూరుపేట గ్రామంలో నరసింహా పిరమిడ్ కేంద్రం వద్ద వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిరమిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధ్యానాన్ని గ్రామ సర్పంచ్ చిలువేరు పూర్ణమ్మ బుచ్చిరామయ్యతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.
VZM: సీతం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్కు నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అనంతరం ఆమె నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశుతులయ్యారు.