కూర్మాసనం(తాబేలు భంగిమ) వెన్నెముకను బలోపేతం చేస్తూ వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకను సాగదీయడం ద్వారా ఇది వీపు, భుజాలు, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఉదర భాగంపై ఒత్తిడి తెచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. మెదడుకు, శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించి విశ్రాంతి ఇస్తుంది.
KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.HYD దోమలగూడలో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్లో తమ సామర్థ్యాన్ని చాటారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సత్కరించారు.
వరంగల్ నగరంలో చెత్త వేసే ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్లోని కాకతీయ కాలనీ, కేయూసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త క్లియర్ చేయని ఇద్దరు జవాన్లకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు.
W.G: మొగల్తూరులో ప్రసిద్ధి గాంచిన మామిడి ఫలసాయాన్ని వేలం వేసుకునేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మామిడి రైతులు, వర్తకులు సోమవారం అధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీవో త్రిశూల పాణి, తహసీల్దార్ రాజ్ కిషోర్కు వినతిపత్రం అందజేశారు. మామిడి విక్రయాల కోసం వేలం కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
NDL: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు ఎంపీ డా. బైరెడ్డి శబరి, కలెక్టర్ జి.రాజకుమారి సహకారంతో సోమవారం సాగునీరు విడుదల చేయించారు. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేయగా.. పంటలు రక్షించబడ్డాయని రైతులు ఎంపీ, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
PLD: గరికపాడు గ్రామంలో సోమవారం రాత్రి పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అక్కడ నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల కోసం ఏప్రిల్ నెలలో రూ. 20 లక్షలు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మొఘల్ జాను, కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యాయామ కళాశాలలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 302 మంది పరీక్ష రాయగా 294 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జవాబు పత్రాల పునఃమూల్యాంకన కోసం ఈ నెల 27లోపు ఒక్కో పేపర్కు రూ.1860 చెల్లించాలన్నారు.
TG: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని DJF వ్యక్తం చేసింది. గతంలో ప్రతి జిల్లా ఐదుగురికి, ఎడిషన్ జర్నలిస్టులకు అడ్రెడిటేషన్ కార్డులు వచ్చాయని వెల్లడించింది. ఇప్పుడు, కేవలం ఎడిషన్ సెంటర్కు 4 మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమని పేర్కొంది. ఈ నిబంధన వల్ల చాలామంది డెస్క్ జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దూరం అవుతున్నారని తెలిపింది.
NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
BPT: పంగులూరు మండలం ముప్పవరంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన 91 మందికి మొత్తం రూ. 77.33 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఊరటనిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
SKLM: మెళియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో ఎల్లమ్మ (జామి) జాతర ఇవాళ ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
VZM: చీపురుపల్లిలో జరుగుతున్న కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర పురస్కరించుకుని వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజా సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారికోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసామని, మంగళవారం కూడా భక్తులు అమ్మవారి దర్శనాలు, మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.
NDL: వెనుకబడిన రాయలసీమను 12 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొంచెం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చాగలమర్రిలో నాయకులతో కలిసి మాట్లాడారు. దశాబ్దాలుగా పాలకులు సీమకు అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
MBNR: భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తితో మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.
KRNL: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ.కుమారస్వామి సోమవారం మంత్రాలయాన్ని సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. గురు వైభవోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థ స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద అధికారులు, నాయకులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.