KMR: నిజాంసాగర్ మండలం చిన్నకొడప్గల్ గ్రామంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నేడు బిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్ఎస్ మద్దతు సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలన్నారు.
ప్రకాశం: జిల్లాలో రబీ 2025-26 సీజన్కు అన్నిపంటలకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా 34,878 మెట్రిక్ టన్నుల ఎరువు పంపిణీ ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. రైతులు కొనుగోలు చేయు సమయంలో బస్తాపై ముద్రించిన MRP ధరలను చూసుకుని దాని ప్రకారం పైకం చెల్లించి డీలర్ నుంచి రసీదు పొందాలన్నారు.
EG: నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీని సోమవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర BJP అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ సందర్శించిన ఆయన వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వీసీతో చర్చించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన ప్రగతి పనులను మాధవు వీసీ వివరించారు.
AP: పోలవరం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రంపచోడవరం మండలం రంప, మర్రివాడ అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ సిబ్బంది ఇటీవల మండపేట సమీపంలో పులిని పట్టుకుని విశాఖ జూలో వదిలిపెట్టారు. ఈనెల 19న దేవీపట్నం-పాపికొండలు అభయారణ్యంలో అధికారులు పులిని వదిలారు. రామన్నవలస, రంపలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.
KRNL: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ సెక్రెటరీ జయలక్ష్మి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ సంస్థ మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా శనగలు క్వింటా రూ.5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు దిగుబడులు అమ్ముకోవాలని సూచించారు.
MNCL: ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షా ప్యాడ్, హాల్ టికెట్, పెన్నులను తెచ్చుకోవాలని సూచించారు.
వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో PM మోదీ మామునూర్ విమానాశ్రయంతో పాటు కాజీపేట అయోధ్యపురంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గీసుగొండ మెగా టెక్స్టైల్ పార్కులను ప్రధాని ప్రారంభిస్తారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
NDL: మహానంది గ్రామంలో ఆలయ ఉద్యోగి చల్లగాలి లక్ష్మయ్య సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా?, అనారోగ్య సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
NZB: నవీపేట్ మండలంలోని అబ్బపూర్ (ఎం)లో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. బెల్లిడిగే అబ్బన్న అనే రైతు పశువుల పాకపై దాడి చేసిన చిరుత, ఒక దూడను చంపేసింది. సోమవారం ఉదయం యజమాని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీట్ అధికారులు జాహుర్, సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అడుగుజాడలను సేకరించారు.
W.G: కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రజల మీద ఉందని, కళాపరిషత్ నాటికలు ప్రజలకు సందేశాలు ఇచ్చే విధంగా ఉండాలని ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. మార్చి 13 నుంచి 16 వరకు వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటికల పోటీల పుస్తకాన్ని ఎంపీ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు సోమవారం కళాపరిషత్ ప్రాంగణంలో నిన్న ఆవిష్కరించారు.
ADB: తొలి రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల గల పిల్లల క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వివిధ విభాగాల్లో సమిష్టి ప్రతిభతో మొత్తం 35 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. కలెక్టర్ రాజర్షిషా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
NLR: రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక సీపీఐ, రైతు సంఘం నాయకులు కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 10% నిధులు కేటాయించాలని అలాగే రూ. 2 లక్షలు పంట రుణాలు రైతులకు ఇప్పించాలని తదితర డిమాండ్లు పొందుపరిచారు.
మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు, కనిగిరి DSP సాయి ఈశ్వర యశ్వంత్ పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
HYD: నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి.
కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు.