కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు BPS-LRS స్కీంలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ సోమవారం పిలుపునిచ్చారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన భవనాలు, అక్రమ లే-అవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. BPSకు మార్చి 11 వరకు, LRSకు ఏప్రిల్ 23 వరకు గడువు ఉందన్నారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో సింగరేణి ‘ప్రయాస్’ సమావేశం నిర్వహించారు. CMPF రీజినల్ కమిషనర్ హరి పచౌరి పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు. గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. CMPF లావాదేవీలన్నీ ఇకపై C-CARES పోర్టల్ ద్వారానే జరుగుతాయని, మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు పొందవచ్చని అయన పేర్కొన్నారు.
SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలో పశువుల సంచారం మితిమీరుతోంది. పగలు వార్డుల్లో, రాత్రి వేళల్లో మెయిన్ రోడ్లపై ఆవులు తిష్టవేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్లపై పశువుల సంచారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నిర్వహించిన సాంప్రదాయ ఊరేగింపు, బియ్యం ఆశీర్వచన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నాయి. సింగపూర్ భక్తులు ప్రదర్శించిన సంగీత విభావరి ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ చక్రవర్తి, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు.
KMM: జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగే ఈ పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
ELR: బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 152 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 113 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే 39 మంది పరీక్షకు హాజరు కాలేదని అధికారులు పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూసేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.
హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి అల్వాల్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది.
PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన, బహిరంగ ప్రదేశాలలో పడవేసిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం నిరోధించి భావితరాలకు ప్రాణాధారం కల్పించాలని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
NZB: 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, ఏర్పాట్లు చూడాలన్నారు.
KNR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్లైన్ హాల్ టికెట్తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండల PHC వద్ద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం పరిశీలించారు. PHC ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎంపీడీవో ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంతంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ADB: సైబర్ క్రైమ్ పై ఉక్కు పాదం మోపుతూ, నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసిందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలకు పరోక్షంగా సహకరిస్తూ మోసాలు చేస్తున్న నిందితులు ఇర్ఫాన్, సాహిల్, అనాస్ ను అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
NGKL: కుమ్మెరలో జరిగిన చిన్నారి మౌనిక మృతి ఘటనపై విచారణకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మంగళవారం రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రామానికి చేరుకుని, ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల నుంచి కమిషన్ నివేదిక కోరింది.
TG: హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రహదారుల అభివృద్ధి, తాగునీటికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.4 వేల కోట్లకుపైగా నిధులతో వీటిని చేపట్టనున్నారు. HMDAలో మరో నాలుగు గ్రామాలను చేర్చేందుకు.. నియోపొలిస్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమి కేటాయింపునకు.. అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.