• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ ఇసుక రవాణా.. ఏడుగురిపై కేసు

KNR: బొమ్మకల్ సమీపంలోని రాజీవ్ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురిని విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన నిందితులపై ఇన్స్‌పెక్టర్ వరుణ్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేశారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

February 21, 2026 / 07:27 PM IST

గోవా గవర్నర్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

VZM: గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్‌పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబందించిన పలు అంశాలపై చర్చించారు.

February 21, 2026 / 07:26 PM IST

దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్: సీఎం

VKB: దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ పటిష్ఠతకు పని చేయాలని సూచించారు.

February 21, 2026 / 07:26 PM IST

సుమారు 50 ఎకరాల పంట మంటలకు దగ్ధం

SKLM: బూర్జ మండలం ఓపివాడ వెంకంపేట గ్రామంలో శనివారం టేకు చెట్లు, మామిడి తోటలు, వరికుప్పలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసిందని గ్రామస్తులు తెలిపారు. సుమారు 50 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. సంబంధిత రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. బాధితులు లబోదిబోమంటున్నారు.

February 21, 2026 / 07:26 PM IST

హైదరాబాద్ సిటీ పోలీసుల సరికొత్త వ్యూహం

HYD: సైబర్ నేరాలపై పోరాటంలో HYD సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి షార్ట్ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. లాటరీ, డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ 1930 హెల్ప్ లైన్‌ను ఫిర్యాదు చేయాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.

February 21, 2026 / 07:25 PM IST

శర్వానంద్ ‘భోగి’ నుంచి కొత్త అప్‌డేట్

దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

February 21, 2026 / 07:25 PM IST

మక్తల్–అనుగొండ రహదారి దుస్థితి ఇది!

NRPT: మక్తల్ టౌన్ నుంచి అనుగొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో నిండిన రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని అంటున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా స్పందన లేదని మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

February 21, 2026 / 07:24 PM IST

రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి: CPM

GNTR: పేదల భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని CPM మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. శనివారం పెదకాకానిలో CPM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ.. పేదల నివాస భూములను పెద్దలకు అప్పగించే కుట్రపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 07:24 PM IST

రెడ్డి సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి: సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని కుల సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ప్రతి సంఘం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్ద ముందడుగు మండలంలోని చిన్న మందడి గ్రామంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి సంఘం ఆర్థిక అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 07:23 PM IST

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. 104 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 75,72,911 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని తెలిపారు.

February 21, 2026 / 07:22 PM IST

16 మండలాల్లో స్వచ్ఛ రథాల ప్రారంభం

ATP: బుక్కరాయసముద్రంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 16 మండలాల్లో స్వచ్ఛ రథాలను జిల్లా పరిషత్ సీఈవో శివ శంకర్, DPO నాగరాజ నాయుడు ప్రారంభించారు. గ్రామాల్లో పొడి చెత్త సేకరించి, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందజేసే వస్తు మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.

February 21, 2026 / 07:22 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే

TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స, మందుల సరఫరాపై ఆరా తీశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 21, 2026 / 07:20 PM IST

మంచినీటి అవస్థలు.. రోడ్డెక్కిన మహిళలు

NLR: ఉలవపాడు మండలం కరేడు పంచాయితీలోని రామకృష్ణాపురం గిరిజన కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన గళం వినిపించారు. 10 రోజులుగా మంచినీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. BPCL కంపెని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరేడు నుంచి రామకృష్ణాపురానికి వచ్చే మంచినీటి పైప్ లైన్ ధ్వంసం అయిందని ఆరోపించారు.

February 21, 2026 / 07:20 PM IST

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

KMR: డోంగ్లీలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 07:20 PM IST

అరకు ఆసుపత్రిలో పారిశుధ్యంపై దొన్ను దొర ‘అరా’

ASR: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రలో భాగంగా అరకు ప్రభుత్వ ఆసుపత్రిని RTC జోన్ ఛైర్మన్ దొన్ను దొర శనివారం తనిఖీ చేశారు. వార్డులన్నీ కలియ తిరిగి పారిశుధ్యం, వైద్య సేవలు, మందుల సరఫరాపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు

February 21, 2026 / 07:20 PM IST