• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పులిగుండు కొండపైన సినిమా షూటింగ్

CTR: టాలీవుడ్ లెజెండ్ కృష్ణ మనవడు దివంగత రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం షూటింగ్ శనివారం పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగింది. సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో భక్తి, భావోద్వేగాలతో సాగనుంది. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం కావడంతో సనిమా రంగంలో ఆసక్తి నెలకొంది.

February 22, 2026 / 07:06 AM IST

పోరుమామిళ్ల కవికి విజయవాడలో సత్కారం

KDP: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో పోరుమామిళ్లకు చెందిన కవి బొల్లు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం తెలుగు, సాంస్కృతిక అకాడమీ AP ఛైర్మన్ విల్సన్ చేతుల మీదుగా ఆయనకు మెమెంటో అందించి సత్కరించారు.

February 22, 2026 / 07:05 AM IST

నగరంలో చికెన్ ధర ఎంతంటే.!

HYD: నగరంలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 07:05 AM IST

మసీదును సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని

NTR: జగ్గయ్యపేట మండలం మహమ్మద్ పేటలోని మసీదును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌తో కలిసి ఎంపీ కేసినేని చిన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పలు సమస్యలు గురించి ఎంపీ కేశినేని దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ ముస్లిం పెద్దలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 07:05 AM IST

నేడు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సత్య నారాయణపురంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు.

February 22, 2026 / 07:05 AM IST

గుప్త నిధుల పేరిట భారీ మోసం

MBNR: గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి రూ.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందుగా పాతిపెట్టిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తవ్వి, కోట్ల రూపాయల విలువ ఉందని నమ్మించి బాధితుడిని మోసం చేసినట్లు వివరించారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

February 22, 2026 / 07:04 AM IST

కారు బోల్తా… నలుగురికి గాయాలు

WGL: రాయపర్తి మండల కేంద్రంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు యువకులు గాయపడ్డారు. జేతురాం తండా పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తండాకు చెందిన వారు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా నేడు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రాయపర్తి నుంచి తండాకు వెళ్తుండగా కారు రహదారి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 07:04 AM IST

హాస్టల్ విద్యార్థి మిస్సింగ్.. కేసు నమోదు

KKD: పిఠాపురం ఎస్సీ బాలుర హాస్టల్లో చదువుతున్న దాసరి పార్ధు శనివారం ఉదయం హాస్టల్ నుంచి RRBHR ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో వార్డెన్ చుట్టు పక్కలా వెతికినా కనిపించ లేదు. పార్ధు సొంతూరు గొల్లప్రోలులోని రంగప్ప చెరువు అని సమాచారం. బాలుడికి 13 ఏళ్లు ఉంటాయాని, పాఠశాల యూనిఫామ్ వేసుకున్నాడని తెలిపారు.

February 22, 2026 / 07:03 AM IST

ఆస్పరి సీఐ కీలక సూచనలు

KRNL: ఆస్పరి మండల ప్రజలకు CI ఏ. గంగాధర్ పలు సూచనలు చేశారు. పక్క మండలాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద వ్యక్తులపై దృష్టి పెట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మహిళలు, వృద్ధులు ముఖ్యంగా చైన్లు ధరించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎటువంటి సమాచారం కోసమైనా 9121101159కు సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 07:03 AM IST

నేడు మెగా జాబ్ మేళా

కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్రపురం ఉపాధి భవన్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం తెలిపింది. 10వ తరగతి నుంచి డిప్లమా వరకు చదివిన 18-27 ఏళ్ల యువత అర్హులు. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని, పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరారు. ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.

February 22, 2026 / 07:00 AM IST

నేడు పరిగిలో పర్యటించనున్న మాజీ మంత్రి

సత్యసాయి: పరిగి మండలంలోని శాసనకోట గ్రామ పంచాయతీలో ఆదివారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ పర్యటించనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్‌ నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ‘కాఫీ విత్‌ వైసీపీ లీడర్స్‌’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని తెలిపారు. అనంతరం గ్రామ కమిటీల నిర్మాణంపై నాయకులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొనాలని కోరారు.

February 22, 2026 / 07:00 AM IST

సర్పంచుల శిక్షణా తరగతులలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం నగరంలోని DPRC భవనంలో నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజల నమ్మకాన్ని గెలిచి ఎన్నికైన సర్పంచులు గ్రామ పాలనలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సర్పంచుల బాధ్యతలతో పాటు ప్రజలకు అందించాల్సిన సేవలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు.

February 22, 2026 / 07:00 AM IST

ఐదుగురు డిగ్రీ విద్యార్థుల డిబార్

ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురం శ్రీ చైతన్య కళాశాలలో ముగ్గురు, గుత్తి MS డిగ్రీ కళాశాలలో ఒకరు, హిందూపురం బాలాజీ విద్యామందిర్‌లో ఒకరిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 07:00 AM IST

రెంజల్‌లో అక్రమ ఇసుక డంపులు సీజ్

NZB: రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో శనివారం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అక్రమ ఇసుక డంపులను సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 26 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తనను అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

February 22, 2026 / 07:00 AM IST

నేడు కరెంట్ కట్

MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

February 22, 2026 / 07:00 AM IST