JGL: ధర్మపురిలో మార్చి 8 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కుంగ్-పూ&కరాటే పోటీల పోస్టర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభ వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
అమెరికా సుప్రీంకోర్టు.. సుంకాలపై ఇచ్చిన తీర్పుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ‘దేశ దిగుమతులను నియంత్రించే సామర్థ్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి కట్టబెట్టినప్పటికీ.. సుప్రీం తీర్పుతో అది జరగకుండా పోతోంది. ఇది చట్టవిరుద్ధమైన తీర్పు. దీనివల్ల అమెరికా పరిశ్రమలు, సరఫరా గొలుసును అధ్యక్షుడు పరిరక్షించే అవకాశం కష్టతరంగా మారనుంది’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కుటుంబానికి BJP అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
VKB: వికారాబాద్లో వైసీసీ అధ్యక్షుడు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
PDPL: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: నీటిని పొదుపుగా వాడుకోవడం అందరి బాధ్యత అని జలమండలి ఎండి అశోక్ రెడ్డి అన్నారు. జలమండలి బస్తిబాట కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలన్నారు.
VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.
E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.
NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్చాలకు చెందిన సాయిప్రసాద్ (23) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు స్వగ్రామానికి వచ్చాడు. శనివారం గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
CTR: కరకంబాడి లోని Amara Raja Group ఆడిటోరియంలో కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ జయదేవ్ గల్లా, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
AP: లడ్డూ కల్తీ విషయంలో మాజీ సీఎం జగన్ అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి భరత్ అన్నారు. హిందుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నవారు బాగుపడలేదన్నారు. జగన్ స్వామివారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్ సంబంధించిన బయోమెట్రిక్ అప్టేట్, ఐరిస్ స్కాన్, పేరు మార్పులు, ఫొటో అప్డేట్, పుట్టిన తేదీ మార్పు, సెల్ నంబరు లింక్, కొత్తగా ఆధార్ కార్డులు ప్రింట్ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ...
WGL: నగరంలోని మున్నూరు కాపు భవన్ ప్రక్కన పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రూ. 22 కోట్లతో నిధులు కేటాయించి నూతన భవనాలు ఏర్పాటు సంతోషంగా ఉండని ఆయన అన్నారు.
ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
RR: కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో 25- 27వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి MLC రూ. 50 వేలు అందజేశారు.దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.