• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏడు ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

TG: HYD కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో రూ.1400 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల పార్కు స్థలంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమ కట్టడాలు చేపట్టారని పూర్తి ఆధారాలతో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలు లభించడంతో అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.

February 21, 2026 / 08:39 PM IST

BREAKING: నిధులు విడుదల

AP: మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ సహాయం అందించినట్లు వెల్లడించారు. దీంతో 95 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రూ.4.75 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి: ఎమ్మెల్యే

SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : హౌసింగ్ పీడీ

TPT: తిరుపతి హౌసింగ్ కార్యాలయంలో ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పనులను వేగవంతం చేసి, నాణ్యత సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ఉగాది నాటికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. సమావేశంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ఇసుక ఫిల్టర్‌లపై దాడులు

MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్ శివారు ఇసుక ఫిల్టర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. హల్దీ వాగు పరిసరాలలో అక్రమంగా ఫిల్టర్లను ఏర్పాటు చేసి తీసుకొని తయారు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ దాడులు చేశారు. దాడుల్లో పైపులైన్లు, విద్యుత్ లైన్‌లను ధ్వంసం చేశారు

February 21, 2026 / 08:38 PM IST

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

MLG: ఆకుల వారి గణపురం, భూపాల్ నగర్ గ్రామాలకు చెందిన పలువురు యువత, వివిధ పార్టీల నేతలు నేడు మంత్రి సీతక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 08:36 PM IST

ప్రజావాణి కార్యక్రమం యధాతధం: కలెక్టర్

ADB: ప్రతి సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో యధావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. నమోదైన ప్రతి ఫిర్యాదుపై అధికారులు 30 రోజుల్లోగా పరిష్కార నివేదిక సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

February 21, 2026 / 08:33 PM IST

కొత్త సర్పంచులకు ఎంపీడీవో సూచనలు

SRD: సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్‌లో నూతన సర్పంచులు, కార్యదర్శులకు శనివారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో శారద నూతన సర్పంచులకు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. జీపీ గ్రామసభ, సాధారణ సమావేశం, తీర్మానం, కార్యదర్శిలతో సమన్వయంపై సూచనలు ఇచ్చారు. సంగారెడ్డిలో ఈనెల 23 నుంచి జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులకు సర్పంచులు వెళ్లాలని సూచించారు.

February 21, 2026 / 08:33 PM IST

మహావీర్ సర్కిల్ వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి

కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద శనివారం లారీ ఢీకొని కేసర్ల హేమసుందర్ (56) మృతి చెందారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు కేసర్ల పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

February 21, 2026 / 08:32 PM IST

సజ్జాపురంలో అగ్నిప్రమాదం

W.G: తణుకు సజ్జాపురం మహాలక్ష్మి నగర్ లోని ఖాళీ స్థలాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ స్థలంలోని పిచ్చిమొక్కలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

February 21, 2026 / 08:32 PM IST

తెలంగాణ ఉద్యమకారుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: తెలంగాణ ఉద్యమకారుడు మణుగూరు మండల పరిధిలోని 220 కెవి సబ్ స్టేషన్  ప్రాంత నివాసి అక్కినపల్లి సైదులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సైదులు ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను చరవాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు.

February 21, 2026 / 08:31 PM IST

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదు’

HYD: చంచల్ గూడ కేంద్ర కారగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్, ఉప్పల వెంకటేష్ గుప్తా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ పై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

February 21, 2026 / 08:31 PM IST

టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

KNR: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

February 21, 2026 / 08:30 PM IST

గురుకుల పాఠశాలలో సంక్షేమ శాఖ అధికారులు తనిఖీ

KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాగముని, పూర్ణచంద్రరావు శనివారం తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని శిథిలావస్థమైన తరగతి గదులను సందర్శించి, పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులను ఆరా తీశారు.

February 21, 2026 / 08:30 PM IST

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్త వాహించాలని సూచించారు.

February 21, 2026 / 08:30 PM IST