• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సంత్ రవిదాస్ విగ్రహావిష్కరణ.!

RR: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో సంత్ శిరోమణి గురు రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మోచి సంఘం ఏర్పాటు చేసిన గురు రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక నాయకులు బోయిని మహేష్ యాదవ్, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, రవిదాస్‌కు నివాళులర్పించారు.

February 22, 2026 / 06:25 PM IST

రజకులపై దాడి ఘటనను ఖండించిన నాయకులు

KRNL: ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించారు. దాడిలో పసిబిడ్డ మృతి చెందడం దుర్మార్గమని పేర్కొన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి భద్రత, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 06:25 PM IST

యువతకు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమం

ASR: యువతకు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమమని పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి అన్నారు. ప్రధాని మోడీ మనసులో మాట కార్యక్రమాన్ని ఆదివారం లైవ్ టెలికాస్ట్ ద్వారా కళాశాలలో విద్యార్థులకు చూపించారు. దేశాభివృద్ధికి యువత భాగస్వామ్యం తదితర అంశాలపై కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 06:24 PM IST

బీసీలకు రూ. 25వేల కోట్లు కేటాయించాలి: ఆర్.కృష్ణయ్య

TG: అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి, వివిధ పథకాల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్నారని.. కానీ గత రెండేళ్లుగా కేవలం రూ. 10వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.

February 22, 2026 / 06:24 PM IST

కాణిపాకం వినాయకుణ్ణి దర్శించుకున్న కేంద్ర మంత్రి

SKLM: ప్రముఖ పుణ్య క్షేత్రం కాణిపాకం వరసిద్ది వినాయకుణ్ణి ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభతో కేంద్ర మంత్రికి కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆర్చక స్వాములు శేష వస్త్రం, ప్రసాదం ఆయనకు అందించి, ఆశీర్వదించారు.

February 22, 2026 / 06:23 PM IST

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

VZM: బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆదివారం ఆ గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ పోతల రమణమ్మ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

February 22, 2026 / 06:22 PM IST

కాసరబాదలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

SRPT: కాసరబాదలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. పేదల సొంతింటి కల కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా వంచించిందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు గృహవసతి కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:21 PM IST

క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించాలి: మంత్రి

KMM: కేవలం నిధులు ఉంటే సరిపోదని, పనుల నాణ్యతను ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు ప్రతిరోజూ తమ వార్డుల్లో 2 గంటల పాటు పర్యటిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి నేడు పేర్కొన్నారు. ఎదులాపురంలో నూతన వార్డు సభ్యుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు.

February 22, 2026 / 06:21 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 658 స్వామివారిని దర్శించుకున్నారని, 16 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 5,218 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:20 PM IST

శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల

NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

February 22, 2026 / 06:20 PM IST

జగన్ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

E.G: మాజీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ క్రైస్తవ సోదరులు రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. రావులపాలెంలో వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం నాటికీ గుణదల వరకు సాగనుంది. కూటమి పాలంలో ప్రజలు విసుగు చెందారని రాబోయేది మరల YS జగన్ అని సుధాకర్ అన్నారు.

February 22, 2026 / 06:20 PM IST

తాటిపాములలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

WNP: శ్రీ రంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు.గ్రామ దేవతలను పూజించడం గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు నిర్మించడం ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:19 PM IST

తైక్వాండలో విద్యార్థులకు బెల్టుల ప్రధానం

NLG:నార్కట్‌పల్లిలోని పీవీఆర్ చేతన పాఠశాలలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టులు అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఎగ్జామినర్ సుధాకర్ ఆధ్వర్యంలో మొత్తం 65 మంది విద్యార్థులు బెల్టులు సాధించారు.

February 22, 2026 / 06:19 PM IST

T20 WC: శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్

సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 146 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 95 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో షనక (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్ 3 వికెట్లు తీయగా.. ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు.

February 22, 2026 / 06:19 PM IST

భీమవరంలో ఉగాది వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ

WG: మన సంస్కృతి సాంప్రదాయాలు చెరగని ముద్రలని, ఉగాది సంక్రాంతి, దసరా లాంటి పండుగలు మన సంప్రదాయ పండుగలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆదివారం మార్చి 19న శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్‌ను ఎమ్మెల్యే భీమవరం కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.

February 22, 2026 / 06:18 PM IST