• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్న రోజులు.!

BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాష్‌ రూమ్‌లలో నీరు లేక దుర్వాసన వ్యాపించడంతో రోగులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన పై అధికారులు స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

February 22, 2026 / 03:58 PM IST

అభిషేక్ శర్మపై అమీర్ హాట్ కామెంట్స్

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ గుడ్డిగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శించాడు. బంతి స్లాట్‌లో పడితే తప్ప అతడు షాట్లు ఆడలేడని, ఆఫ్ సైడ్ వచ్చే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం అతడి బలహీనత అని పేర్కొన్నాడు. అభిషేక్ తన ఆటతీరును మెరుగుపరుచుకోకపోతే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగలేడని హెచ్చరించాడు.

February 22, 2026 / 03:57 PM IST

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రెరా వార్నింగ్‌

TG: ఇళ్లు/ఫ్లాట్‌ విక్రయాల కోసం రిజిస్ట్రేషన్‌ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని సంస్థలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.

February 22, 2026 / 03:56 PM IST

ఆర్చరీ టోర్నమెంట్‌ను ప్రారంభించిన కలెక్టర్

NTR: విజయవాడలో 3వ NTPC ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తొలి బాణాన్ని విడుదల చేసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్చర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా యువ క్రీడాకారులకు తమ ప్రతిభను కనబరిచే మంచి వేదిక అన్నారు.

February 22, 2026 / 03:56 PM IST

దుర్గ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు

చిత్తూరు న్యూ రాజీవ్ కాలనీలో దివంగత TDP నాయకురాలు దుర్గ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనుబంధ కమిటీల సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:53 PM IST

నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహణ

ప్రకాశం: కొండేపిలోని బీసీ కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేపి సీఐ సోమశేఖర్, వారి సిబ్బందితో కాలనీలోని ప్రతి ఇంటిని, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 22, 2026 / 03:52 PM IST

తోట్లవల్లూరులో ప్రజల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం

కృష్ణా: తోట్లవల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం ఆదివారం జరిగింది. తోట్లవల్లూరు గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు బొడ్డు నితీష్ నేతృత్వంలో గ్రామస్థుల నుంచి సూచనలు, సమస్యలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు తమ విన్నపాలు తెలిపారు.

February 22, 2026 / 03:51 PM IST

కేంద్రని కలిసిన కలెక్టర్, ఎస్పీ

GDWL: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆదివారం అలంపూర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎస్పీ మంత్రికి వివరించారు.

February 22, 2026 / 03:51 PM IST

‘దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’

PLD: ఏపీలో కాంగ్రెస్ ఆఫీసులపై ఏబీవీపీ దాడులను సత్తెనపల్లి పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్ఞాన్ రాజ్ పాల్ ఖండించారు. ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనాగరికమన్నారు. ఢిల్లీ ఏఐ సదస్సులో మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తే ఆంధ్రాలో దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 03:51 PM IST

నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రీ ఫేజ్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

February 22, 2026 / 03:50 PM IST

తోట కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

కోనసీమ: రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట రాము సోదరుడు తోట సత్యనారాయణ కుటుంబాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి కూడా తీరని లోటు అని అన్నారు.

February 22, 2026 / 03:50 PM IST

శర్వానంద్ సినిమా కోసం మ్యూజిక్ కసరత్తులు

హీరో శర్వానంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల ఓ మూవీని తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్‌పై పని జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు టాక్. ముందుగా శర్వా లేని సీన్స్‌ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 03:50 PM IST

వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

WNP: వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల కన్నా తక్కువ ధరలకు బస్సులు వస్తాయని డ్రైవర్ బత్తా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు. వివరాలకు 7995701851,9676563377 నంబర్లను సంప్రదించాలని కోరారు.

February 22, 2026 / 03:48 PM IST

ఇకనుంచి సత్వర విద్యుత్ సేవలు

TG: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తన వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. విద్యుత్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే వివిధ సేవలను పొందవచ్చు.

February 22, 2026 / 03:46 PM IST

కామారెడ్డి: ఈనెల 24న మైనార్టీ కమిషన్ ఛైర్మన్ రాక

KMR: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారీక్ అన్సారీ ఈనెల 24న జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో కలిసి మైనార్టీ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రతో భేటీ అవుతారని జిల్లా ఉన్నత అధికారులు తెలిపారు. మైనార్టీల సమస్యలు, వారి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష జరుపుతారు.

February 22, 2026 / 03:45 PM IST