సత్యసాయి: పుట్టపర్తిలో ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు ఒంటరి మహిళలకు అడిషనల్ ఎస్పీ అంకిత సురాన కుట్టు మిషన్లు అందజేశారు. పద్మావతి, హరిత, అరుణమ్మ అనే మహిళల కుటుంబ పరిస్థితులను గమనించి ఈ సాయం చేశారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అమోఘమని అడిషనల్ ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరారు.
KNR: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 15,389 మందికి గాను 14,989 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పలు కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
KRNL: రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో సర్పంచ్, MPTC స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ సూచించారు. హొళగుందలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. హొళగుంద ప్రజలు YCP పార్టీకి మెజారిటీ ఇస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో త్రాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోం. ఎవరైనా బంధు ప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకొస్తా అంటే వారిని చెప్పుతో కొడతా. శత్రవైన పార్టీలో చేర్చుకుంటాము కానీ.. వెన్నుపోటు దారులను క్షమించను’ అంటూ హెచ్చరించారు.
WNP: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పాల్గల్ మండలానికి చెందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) విద్యార్థిని బుధవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే కారణమని సమాచారం.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ వద్ద రైతాంగ సమస్యలపై చేస్తున్న సామూహిక అధ్యక్షులు బుధవారం 6వ రోజుకు చేరాయి. శిబిరంలోని దీక్షాపరులకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
PPM: జిల్లాలోని ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు ఉండే సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రతీ సమస్యను సావధానంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైతే చూస్తూ ఊరుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఉద్యోగులతో సమీక్షా సమావేశం జరిగింది. వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, దోమల నివారణ ఫాగింగ్, వీధి దీపాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన BRS యూత్ నాయకులు శ్రీకాంత్ మాతృమూర్తి తడక రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BJP జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
MHBD: తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సెక్రటరీ వెలుగు మురళిని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ ఇవాళ సస్పెండ్ చేశారు. సొసైటీ నిధుల దుర్వినియోగం చేశారనే ఫిర్యాదులపై ఇటీవల విచారణ ప్రారంభించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తుది నివేదిక వచ్చే వరకు విధుల నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
HYD: సికింద్రాబాద్ ఏంఆర్వో ఆఫీస్లో ఆర్డీవో సాయిరాంను బుధవారం మోండా మార్కెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న మారేడ్పల్లి 2BHK లబ్ధిదారుల జాబితాపై చర్చించారు. దీనికి ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.
MHBD: జిల్లా వ్యాప్తంగా SFI ఆధ్వర్యంలో ఇవాళ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రారంభమైనట్లు SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని MHBD జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓ పాఠశాలలో UTF రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, SFI జిల్లా కార్యదర్శి మధు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2000 మంది విద్యార్థులకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మధు వెల్లడించారు.
కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం వివిధ సేవల ద్వారా రూ.2.68 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.
T20 WCలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో పాక్ జట్టుపై SMలో ఆ దేశ అభిమానులు విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ సల్మాన్ అఘాతో పాటు అతడి భార్య, కుమారుడిని టార్గెట్ చేస్తూ అసభ్య కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అఘా భార్య స్పందిస్తూ.. “నన్ను, నా కొడుకును దుర్భాషలాడటం వల్ల మీరు WC గెలవలేరు’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. పాడి రైతులు పశు సంపద పెంచాలని ఈ సందర్భంగా రైతులకు పూజించారు. మండల పశువైద్యాధికారి లక్ష్మీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు